రాజస్థాన్ లక్ష్యం 165 | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ లక్ష్యం 165

Published Tue, Apr 14 2015 9:46 PM

రాజస్థాన్ లక్ష్యం 165

అహ్మదాబాద్: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 165 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 164  పరుగులు చేసింది. ముంబై టాపార్డర్ విఫలమైనా.. కీరన్ పొలార్డ్, కోరీ ఆండర్సన్ మెరుపులు మెరిపించి జట్టును ఆదుకున్నారు. పొలార్డ్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఆండర్సన్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.


ఆరంభంలో ముంబై టాపార్డర్ విఫలమైంది. ముంబై 11 ఓవర్లలో 3 వికెట్లకు 46 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్ (16), రోహిత్ శర్మ (0), ఉన్ముక్త్ చంద్ (12) అవుటయ్యారు. మరో వైపు ఓపెనర్ ఫించ్ (10) కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ సమయంలో పొలార్డ్, ఆండర్సన్ చెలరేగడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది. ముఖ్యంగా పొలార్డ్ బౌండ్రీలతో పోటెత్తాడు. రాజస్థాన్ బౌలర్లు సౌథీ, మోరిస్, కులకర్ణి, తాంబె, బిన్ని తలా వికెట్ తీశారు.
 

Advertisement
Advertisement