సెమీస్‌లో సాయి దేదీప్య | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయి దేదీప్య

Published Fri, Jan 6 2017 10:28 AM

sai dedeepya enters semis of under 16 tennis tourny

సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో  దేదీప్య 6-1, 6-3తో పూజా ఇంగ్లే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. సెమీస్‌లో తను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్ఞానితతో తలపడుతుంది.   

Advertisement
Advertisement