పేస్పై బోపన్న సెటైర్లు! | Sakshi
Sakshi News home page

పేస్పై బోపన్న సెటైర్లు!

Published Mon, Sep 19 2016 2:51 PM

పేస్పై బోపన్న సెటైర్లు!

న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్లకు భారత్ నుంచి సరైన మిక్స్డ్ డబుల్స్ జోడీని  పంపలేదంటూ వెటరన్ ఆటగాడు లియాండర్ చేసిన వ్యాఖ్యలపై మరో ఆటగాడు రోహన్ బోపన్నపరోక్షంగా సెటైర్లు గుప్పించాడు. ఆ సదరు ఆటగాడికి ఎటువంటి పని లేకపోవడంతో మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి యత్సిస్తున్నాడంటూ విమర్శలు సంధించాడు. ఇలా వార్తల్లో నిలవడానికి సహచర ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవడడం అతనికి కొత్తమే కాదన్నాడు. అంతకుముందు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా పేస్ వ్యాఖ్యలపై మండిపడింది.  లియాండర్ పేరును ప్రస్తావించకుండానే అతనొక విష పురుగు అంటూ ట్విట్టర్లో విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని సానియా పేర్కొంది.


గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని  పేస్ వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదని, దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్‌డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామని అన్నాడు. దీంతో సానియా, రోహన్ బోపన్ననల మిక్స్డ్ డబుల్స్ జోడి ఎంపికను పరోక్షంగా తప్పుబట్టాడు.

 

Advertisement
Advertisement