సౌరవ్‌ ఘోషాల్‌ పరాజయం | Sakshi
Sakshi News home page

సౌరవ్‌ ఘోషాల్‌ పరాజయం

Published Fri, Dec 15 2017 12:46 AM

Sourav Ghoshal lostthe game - Sakshi

ప్రపంచ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్‌ సౌరవ్‌ ఘోషాల్‌ మూడో రౌండ్‌లో ఓటమి చవిచూశాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో సౌరవ్‌ 14–12, 5–11, 6–11, 7–11తో రెండో సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ కరీమ్‌ అబ్దుల్‌ గవాద్‌ (ఈజిప్ట్‌) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన హరిందర్‌ పాల్‌ సంధూ, మహేశ్‌ మంగావ్‌కర్‌... మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.   

Advertisement
Advertisement