కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు శ్రమిస్తోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం తొలి సెషన్లో విఫలమైన భారత బౌలర్లు లంచ్ విరామం తర్వాత విజృంభించారు. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు. 140/3 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు టీ విరామానికి 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ విరామానికి లంక తొలి ఇన్నింగ్స్లో 93 పరుగులు వెనుకబడి ఉండగా, చేతిలో మూడు వికెట్లున్నాయి.
లంక ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్లో భారత్ బౌలర్లు ఎంత శ్రమించినా ఈ జోడీని విడదీయలేకపోయారు. లంచ్ తర్వాత భారత పేసర్ ఇషాంత్.. తిరుమన్నెను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇషాంత్.. చండీమల్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ హీరో మాథ్యూస్తో పాటు దమ్మిక ప్రసాద్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. టీ విరామానికి ముబారక్, హెరాత్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు.. ఉమేష్, బిన్నీ, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లు వీలైనంత త్వరగా లంక టెయిలెండర్లను తొలగిస్తే అంత ఆధిక్యం వస్తుంది.
టీమిండియాకు ఆధిక్యం దక్కేనా..?
Published Sat, Aug 22 2015 3:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement