ఖమ్మం: 59వ జాతీయ సీనియర్ బాల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నీలో భాగంగా పట్టణంలో మహిళా విభాగంలో బుధవారం జరిగిన పోటీలో కర్ణాటక జట్టుపై తమిళనాడు జట్టుగెలిచింది. ఆద్యంతం ఏకపక్షంటా సాగిన ఈ మ్యాచ్ లో తమిళనాడు ఆటగాళ్ల జోరుముందు కర్ణాటక ఆటగాళ్లు చతికిలబడ్డారు. తమిళనాడు జట్టు 29-24, 29-17 తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ఈ విజయంతో తమిళనాడు జట్టు వరుసుగా టైటిల్ సాధించడం నాల్గోసారి. కాగా మరో మ్యాచ్ లో ఇండియన్ రైల్వేస్ పై హైదరాబాద్ గెలుపొందింది.
పెలీలియన్ గ్రౌండ్ లో చాంపియన్ షిప్ పోటీలు శనివారం ఘనంగా ఆరంభమైయ్యాయి. ఐదు రోజుల పాటు డే అండ్ నైట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలకు దేశం నలుమూల నుంచి అధిక సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొననున్నారు. 29 రాష్ట్రాల నుంచి 33 పురుషల జట్లు, 29 మహిళల జట్లు హాజరైయ్యాయి.