వీరిపైనా కన్నేయాలి | Sakshi
Sakshi News home page

వీరిపైనా కన్నేయాలి

Published Fri, Mar 6 2015 11:43 AM

వీరిపైనా కన్నేయాలి

పెర్త్: బిగ్ ఫైట్ కు భారత్, వెస్టిండీస్ జట్లు సిద్దమయ్యాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న కరీబియన్ జట్టును కంగుతినిపినిపించి టీమిండియా జైత్రయాత్ర కొనసాగించాలని భావిస్తోంది. క్రిస్ గేల్ ను అడ్డుకునేందుకు ధోని సేన వ్యూహాలు రచిస్తోంది. అయితే గేల్ పాటు శామ్యూల్స్, ఆండ్రూ రసెల్స్, సామీ, సిమన్స్ లపైనా దృష్టి సారించాల్సివుంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో గేల్ తో పాటు శామ్యూల్స్ సెంచరీతో చెలరేగాడు.

47 వన్డేలు ఆడి 129.8 స్టైయిక్ రేటు కలిగిన రసెల్స్ తనదైన రోజున మ్యాచ్ ఫలితాన్ని శాసించగలడు. చివరల్లో వేగంగా పరుగులు సాధించడం అలవాటుగా మార్చుకున్న సామీ భారీ స్కోరుకు బాటలు వేయడంతో దిట్ట. బంతితోనూ రాణించగలడు. సిమన్స్ నిలకడకు మారుపేరుగా మారాడు. విండీస్ తో మ్యాచ్ లో వీరిపైనా ధోని సేనా దృష్టి పెట్టాల్సివుంటుంది.

Advertisement
Advertisement