పెర్త్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. రోహన్ ముస్తఫా(2)పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్లు అమ్ జద్ అలీ(4), బెరంగర్లు(4), కృష్ణా చంద్రన్(4), కుర్రమ్ ఖాన్(14), ఎస్పీ పాటిల్(7) వరుసగా పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.