ఫైనల్లో విక్టరీ ప్లేగ్రౌండ్‌ | Sakshi
Sakshi News home page

ఫైనల్లో విక్టరీ ప్లేగ్రౌండ్‌

Published Wed, Mar 8 2017 6:50 PM

ఫైనల్లో విక్టరీ ప్లేగ్రౌండ్‌

హైదరాబాద్‌: సి.నర్సిరెడ్డి స్మారక బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ విక్టరీ ప్లేగ్రౌండ్‌ (వీపీజీ) జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. అబిడ్స్‌లోని రెడ్డి బాయ్స్‌ హాస్టల్‌ ప్రాంగణంలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో వీపీజీ 104–73తో సికింద్రాబాద్‌ వైఎంసీఏ జట్టుపై గెలిచింది. విరామ సమయానికి వీపీజీ 49–39తో ఆధిక్యంలో ఉంది. వీపీజీ జట్టులో ప్రసాద్‌ 32 పాయింట్లు, నవీన్‌ 24 పాయింట్లు స్కోరు చేశారు. వైఎంసీఏ జట్టులో సన్నీ 28 పాయింట్లు, క్రిస్‌ 22 పాయింట్లు సాధించి రాణించారు.

Advertisement
Advertisement