ఇంగ్లండ్లో పర్యటించే భారత ‘ఎ’ జట్లను కూడా సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. వన్డే టీమ్కు శ్రేయస్ అయ్యర్, అనధికారిక టెస్టులు ఆడే జట్టుకు కెప్టెన్గా కరుణ్ నాయర్ వ్యవహరిస్తారు. ఆంధ్ర బ్యాట్స్మన్ గాదె హనుమ విహారికి ఈ రెండు టీమ్లలోనూ స్థానం లభించగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆంధ్ర వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ నాలుగు రోజుల మ్యాచ్ల (అనధికారిక టెస్టులు)లో తలపడే జట్టులో చోటు దక్కింది. ఈ టూర్లో భారత ‘ఎ’ జట్టు... ఇంగ్లండ్ ‘ఎ’, వెస్టిండీస్ ‘ఎ’లతో తలపడుతుంది.
వన్డే ‘ఎ’ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్, విహారి, సంజు శామ్సన్, దీపక్ హుడా, రిషభ్ పంత్, విజయ్ శంకర్, గౌతమ్, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ణ, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్.
టెస్టు ‘ఎ’ జట్టు: కరుణ్ నాయర్ (కెప్టెన్), ఆర్.సమర్థ్, మయాంక్ అగర్వాల్, ఈశ్వరన్, పృథ్వీ షా, అంకిత్ బావ్నే, విజయ్ శంకర్, కేఎస్ భరత్, జయంత్ యాదవ్, షాబాజ్ నదీమ్, అంకిత్ రాజ్పుత్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, రజనీశ్ గుర్బాని.
రెండు ‘ఎ’ జట్లలో హనుమ విహారి
Published Wed, May 9 2018 1:23 AM
# Tag
Related news
-
Fact Check: వివాదాల ‘విహారి’!
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చేస్తున్న కృషితో పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన క్రీడలు దేశాన్నే ఆకర్షించాయి. ఈ రాష్ట్రం ఏ రంగంలో బాగుపడినా నచ్చని పచ్చమీడియా.. ముఖ్యంగా రామోజీరావు క్రీడలపైనా విషం చిమ్ముతున్నారు. ఇందుకు ఆంధ్ర రంజీ మాజీ కెప్టెన్ హనుమ విహారి ఉదంతాన్ని కూడా విషపూరితం చేసి, చిలువలు పలువలు అల్లి ఈనాడులో కథనాలు వండి వారుస్తున్నారు. నిజానికి ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్గా హనుమ విహారి వైఖరి ఆది నుంచి వివాదాస్పదమే. జట్టు సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడుతుంటారన్న ఫిర్యాదులున్నాయి. విహారి వ్యవహార శైలిపై పలుమార్లు సాటి ఆటగాళ్లు, ఏసీఏ అధికారులు, కోచ్లు, కోచ్ హెడ్లు కూడా ఫిర్యాదులు చేశారు. అవన్నీ వాస్తవమేనని విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఏసీఏ కథనం ప్రకారం.. విహారిపై ఫిర్యాదుల్లో కొన్ని.. ♦ బెంగాల్ రంజీ మ్యాచ్లో విహారి అందరి ముందు ఒక ఆటగాడి (పృథ్వీరాజ్)ని అసభ్యంగా దుర్భాషలాడారు. దీనిపై ఆయన ఏసీఏకు ఫిర్యాదు చేశారు. ♦ సాటి జట్టు సభ్యులు, సపోర్టు స్టాఫ్తో పాటు ఏసీఏ అధికారులు సైతం తరచూ విహారి అసభ్యకర పదజాలంపై ఫిర్యాదులు చేశారు. ♦ ముస్తాఖ్ ఆలీ టోర్నమెంట్ ఆంధ్ర టీం మేనేజర్ రాజారెడ్డి కూడా జట్టులో గ్రూపులకు విహారి కారణమవుతున్నారని ఫిర్యాదు చేశారు. ♦ ఇతర రాష్ట్రాల తరఫున మ్యాచ్లు ఆడేందుకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాలని విహారి పదే పదే ఏసీఏని అడిగేవారు. కొన్నిసార్లు తన నిర్ణయాన్ని మార్చుకుని క్షమాపణలు కూడా చెప్పేవారు. తరచూ కెప్టెన్సీ నుంచి తప్పించాలనేవారు. మళ్లీ ఆంధ్ర జట్టులోనే కొనసాగుతానని చెబుతుండేవారు. ♦ విహారి అనుభవం, ఆంధ్ర క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా జట్టులో కొనసాగించారు. ♦ హనుమపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని విచారణలో తేలింది. ♦ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాలని సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో విహారి తర్వాత స్థానంలో ఉన్న రిక్కీబుయ్ని కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని కూడా విహారి అంగీకరించి అభినందించారు కూడా. ♦ ఆ తర్వాత కెప్టెన్గా తననే కొనసాగించాలంటూ విహారి తమను బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు జట్టు సభ్యులు తెలిపారు. ♦ పృథ్వీరాజ్ ఒకేసారి రంజీ జట్టులోకి రాలేదు. అండర్ 14, 16, అండర్ 19 వినూ మన్కడ్, కూచ్ బిహార్, అండర్ 23, 25 కల్నల్ సీకేనాయుడు, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడి ప్రతిభ నిరూపించుకున్నాడు. ఇంత సీనియారిటీ, అనుభవం ఉన్నప్పటికీ, జనవరిలో బెంగాల్తో జరిగిన రంజీ మ్యాచ్లో కెప్టెన్ విహారి అతన్ని ఆడించలేదు. గాయపడిన మరో వికెట్ కీపర్ను ఆడించారు. చాలా జట్లలో 17 మందికన్నా ఎక్కువ సభ్యులు ఈనాడు పేర్కొన్నట్టు.. క్రికెట్ జట్టులో 15 మందే ఉండాలన్న నిబంధనేమీ లేదు. 17 మందికి మించి సభ్యులున్న జట్లు చాలానే ఉన్నాయి. 2023–24 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ టీమ్లో 18 మంది ఉన్నారు. హైదరాబాద్ జట్టులోనూ 17 మంది కంటే ఎక్కువే ఉన్నారు. కోవిడ్ సమయంలో ఏసీఏ కూడా ఆంధ్ర జట్టుకు 22 మందిని ఎంపిక చేసింది. ఏసీఏ కార్యదర్శి కోటా కూడా కొత్తదేమీ కాదు.. చంద్రబాబు హయాం నుంచే ఉంది. ఈ విషయాలు తెలియకుండానే రామోజీ కథనం అల్లారా? ఫౌండేషన్ మూతపడేలా 2021 నవంబర్లో తిరుపతిలో వరదల్లో ప్రజలకు పాలు, బ్రెడ్ వంటి ఆహార పదార్థాలను హనుమ విహారి ఫౌండేషన్ అందించింది. ఫౌండేషన్ సహాయ కార్యక్రమాల్లో ఇద్దరు వాలంటీర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని కనిపించారు. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేయడంలేదని, తామే చేస్తున్నామంటూ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. అయితే, ఈ సహాయ కార్యక్రమానికి టీడీపీకి కానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు కానీ సంబంధం లేదని, తమ బృందంలోని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారని, అంతమాత్రాన ఇది ఎన్టీఆర్ ట్రస్టు చేసినట్టు కాదంటూ విహారి ఫౌండేషన్ గట్టిగా ఖండించింది. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు విహారిని వేధించి, వెంటబడి ఫౌండేషన్ మూతపడేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే టీడీపీ నేతలు ఇప్పుడు విహారిపై ప్రేమ ఒలకబోస్తూ మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రికెట్పై రాజకీయాలు దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ క్రీడపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘క్రికెట్ అభివృద్ధి, విస్తరణకు దేశంలోని పలు అసోసియేషన్ల మాదిరిగానే ప్రతిష్టాత్మక ఏసీఏ కూడా విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నిబంధనలను అనుసరిస్తోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు తావులేదు. ఏసీఏనుద్దేశించి హనుమ విహారి ఆరోపణలు చేయడం విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా సమన్వయం కుదిర్చి సత్ఫలితాలు సాధించడం జట్టు బాధ్యత. అందులోభాగంగా ఏ ఆటగాడైనా తొందరపడినా, మరో రకంగా ప్రవర్తించినా వారి పట్ల అత్యంత సంయమనం పాటిస్తూ జట్టును ఏకతాటిపైకి తీసుకు రావడానికి ఏసీఏ కృషి చేస్తుంది. జట్టు ప్రయాజనాలు, క్రికెట్ స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని లోలోపలే సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తుంది. పరిధి దాటితే నిబంధనల ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. హనుమ విహారి బహిరంగంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఏసీఏ, సాటి సభ్యులపై ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు గమనించాలి’ అని ఏసీఏ కోరింది. పైరవీలు చేస్తే నా కొడుకు కెప్టెన్ అయ్యేవాడుగా? ఆంధ్రా క్రికెట్ జట్టు సభ్యుడు పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి తిరుపతి మంగళం: ‘భారత క్రికెట్ జట్టుకు ఆడిన ఆంధ్రా మాజీ కెప్టెన్ హనుమ విహారి తన సహచర ఆటగాడు పృథ్వీరాజ్పై అసత్య ఆరోపణలతో ట్వీట్ చేయడం బాధాకరం. నిజంగా నేను పైరవీలు చేసి ఉంటే నా కుమారుడు పృథ్వీరాజ్ ఎందుకు ఆంధ్రా జట్టులో 17వ ఆటగాడిగా ఉంటాడు. ఏకంగా కెపె్టన్ అయ్యేవాడు కదా..’ అని పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి అన్నారు. ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతికి చెందిన నా కుమారుడు పృథ్వీరాజ్ అండర్–12, 14, 17, 19 క్రికెట్లో విశేష ప్రతిభ చూపాడు. బ్యాటర్గా, వికెట్ కీపర్గా అనేక రికార్డులు పృథ్వీరాజ్పై ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఒక్క రంజీ మ్యాచ్ అడే అవకాశం రాలేదు. నేను రాజకీయంగా ప్రభావితం చేసి నా కుమారుడిని క్రికెట్ జట్టులోకి తీసుకువస్తున్నట్లు హనుమ విహారి ఆరోపణలు చేయడం సమంజసం కాదు. నేను ఏసీఏను రాజకీయంగా ప్రభావితం చేయగలిగే వాడినే అయితే నా కుమారుడు ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడకుండా ఉంటాడు. నా కుమారుడు పృథ్వీరాజ్ ప్రతిభ కలిగినవాడు. స్వశక్తితో పైకి రావాలని కోరుకుంటాడు. పైరవీలు, రాజకీయ ప్రభావంతో ఎదగాలని ఏ రోజూ కోరుకోలేదు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారి తోటి క్రీడాకారులను పైకి తీసుకువచ్చే విధంగా ఆలోచించాలి. కానీ ఆయన మరొక క్రికెటర్ను దెబ్బతీసేలా మాట్లాడటం, అసత్య ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. హనుమ విహారి చేసిన తప్పులను త్వరలోనే మీడియా ముందుకు తీసుకువస్తా..’ అని నరసింహాచారి చెప్పారు. -
క్రికెట్పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. క్రికెట్ అభివృద్ధి విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఇందుకు విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నియమ నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్ ముందుకు సాగుతోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు ఎక్కడా తావులేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను ఉద్దేశిస్తూ హనుమ విహారి ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్పై ఇలాంటి ఆరోపణలు విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా వారి మధ్య సమన్వయం కుదిర్చి మంచి ఫలితాలు సాధించడం అన్నది జట్టు మేనేజ్మెంట్ మీద ఉన్న ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఏ ఆటగాడైనా తొందరపడ్డా, లేక మరో రకంగా ప్రవర్తించినా వారి విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరించి జట్టును ఒక్కతాటిపైకి తీసుకురావడానికి మేనేజ్మెంట్ నిరంతరం ప్రయత్నిస్తుంది. జట్టు ప్రయోజనాలను, క్రికెట్ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని లోలోపలే వాటిని సర్దుబాటు చేయడానికి యత్నిస్తుంది. పరిధి దాటినప్పుడు నిర్దేశిత నియమావళి, పద్ధతులు ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. సీనియర్ ఆటగాడు హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్పైనా, తోటి ఆటగాళ్లపైనా విమర్శలు చేసిన నేపథ్యంలో కొన్ని రాజకీయ పక్షాల నాయకులు వాటిని ఆసరాగా తీసుకుని అసోసియేషన్ నాయకత్వంపైనా, మేనేజ్మెంట్పైనా ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వాస్తవ అంశాలను తెలియజేస్తున్నాం. హనుమ విహారి బాల్యం నుంచి అన్ని ఏజ్ గ్రూప్ల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడారు. 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడారు. ఇక్కడి నుంచే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తర్వాత 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుండి విహారి తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. హనుమ విహారి విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది. కాని ఈసారి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో భారత జట్టుకు ఎంపిక కాకపోవడం పట్ల తాను ఫ్రస్టేషన్లో ఎమోషన్కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ, ఆంధ్రా తరపున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ను కోరాడు. జట్టులోకి విహారి రావడం, పోవడం వల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది. అయినప్పటికీ విహారి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. -
Hanuma Vihari: బా‘బోరు’ అంతే!.. మావాళ్లు చేస్తే పడుండాలి అనే టైపు!
ప్రపంచంలో ఎక్కడ.. ఏ మూలన జరిగే విషయమైనా తనకు పనికి వస్తుందనుకుంటే వెంటనే రాగం అందుకుని సాగదీయడం చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్న మాట రాజకీయవర్గాల్లో తరచూ వినిపిస్తుంది. మంచి జరిగితే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ఆయన ఎంత ‘దూరమైనా’ వెళ్తారంటారు. టీమిండియా క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టుకు ఆడబోనంటూ ఆరోపణలు చేసిన హనుమ విహారి విషయంలోనూ బాబు అదే పంథాను అనుసరిస్తున్నట్లు కనబడుతోంది. ‘‘హనుమ విహారిని వేధించారు.. మేము అతడికి అండగా ఉంటాం’’.. అంటూ... తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు... తాము అధికారంలోకి వస్తే విహారికి రెడ్కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తామంటూ ఆయన కుమారుడు లోకేశ్ సానుభూతి ఒలకబోస్తున్నారు. టార్చర్ పెట్టారు.. అప్పుడే మర్చిపోయారా? అధికారంలోకి వస్తే.. అని మాట్లాడుతున్న లోకేశ్, చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో.. తమ పార్టీ హనుమ విహారిని వేధించిన తీరును మర్చిపోయినట్లున్నారు. కేవలం ఆటకే పరిమితం కాకుండా హనుమ విహారి ఫౌండేషన్ పేరిట కార్యక్రమాలు చేస్తుంటే.. దానిని తమకు ఆపాదించుకుని.. ఆపై విహారే స్వయంగా తమకు క్షమాపణలు చెప్పేలా టార్చర్ పెట్టిన తీరు వాళ్లకు గుర్తున్నట్లు లేదు. కులం పేరిట విహారిని వివక్షకు గురిచేసి, వ్యక్తిగతంగానూ అతడి ప్రతిష్టను దిగజార్చి ఫౌండేషన్ మూయించేసిన టీడీపీ పెద్దలు ఇప్పుడేమో అతడి పట్ల సానుభూతి ప్రదర్శించడం గమనార్హం. అది కూడా తమ స్వప్రయోజనాల కోసం పాకులాడుతూ..పైగా అతడికేదో మేలు చేస్తామంటూ మొసలి కన్నీళ్లు కార్చడం దౌర్భాగ్యం. గతంలో ఏం జరిగింది? 2021లో తిరుపతిలో వర్షాల నేపథ్యంలో వరదలో చిక్కుకున్న ప్రజలకు విహారి ఫౌండేషన్ పాలు, బ్రెడ్ సహా పలు ఆహార పదార్థాలు పంపిణీ చేసింది. తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ఇందులో ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ ట్రస్టు టీ షర్ట్స్ వేసుకుని కనిపించడంతో.. ఇక టీడీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. ప్రభుత్వంపై బురద జల్లే క్రమంలో విహారి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాన్ని బాబోరి ఖాతాలో వేసేసింది. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సహకారం అందిస్తాయన్న విషయాన్ని.. అది కూడా పక్కోళ్లు చేసిన సాయానికి క్రెడిట్ తీసుకోవాలని స్కెచ్ వేసింది. సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ సాయం కాదిది ఈ విషయాన్ని గమనించిన విహారి ఫౌండేషన్.. ‘‘19- నవంబరు-2021న తిరుపతిలో జరిగిన ఈ సహాయ కార్యక్రమాలకి టీడీపీకి గానీ, ఎన్టీఆర్ ట్రస్టుకు గానీ ఎలాంటి సంబంధం లేదు. మాతో పాటు వచ్చిన రవి, లోకేష్ అని ఇద్దరు వాలంటీర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ టీ-షర్ట్స్ వేసుకుని ఉన్నారు. అంతమాత్రాన ఇది మీరు చేసినట్లు కాదు కదా?’’ అని టీడీపీ క్యాంపునకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. కేవలం రూ. 3500 బ్రెడ్ ఇచ్చి దానకర్ణుడిలా బిల్డప్పా అంటూ దీంతో బాబోరి బ్యాచ్కు కోపమొచ్చి.. ‘‘రవి, లోకేశ్ వాలంటీర్లు కాదు. ఎన్టీఆర్ ట్రస్టు ఉద్యోగులు. అయినా హనుమ విహారి ఫౌండేషన్ కేవలం రూ. 3500 విలువ చేసే బ్రెడ్ను మాత్రమే ప్రజలకు అందించింది. కానీ మేము రూ. 3 లక్షలు అందించాం’’ అంటూ విహారి సేవలను తక్కువ చేసేలా పోస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో విహారి, అతడి ఫౌండేషన్ను ట్రోల్ చేస్తూ ఫౌండేషన్తో వ్యాపారం చేస్తున్నావా? కుల రాజకీయాలకు పాల్పడుతున్నావా అని తమ బుద్ధులను ఆపాదిస్తూ కించపరిచింది. ట్రోల్స్ స్థాయి శ్రుతి మించడంతో విహారి తట్టుకోలేకపోయాడు. కుల వివక్షకు గురిచేశారు ‘‘మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు కానీ రాజకీయ ఉద్దేశాలు కానీ లేవు. జరిగింది ఒక సమాచార లోపం. గత 24 గంటల్లో అతి తీవ్రమైన వ్యక్తి దూషణలకి, మరియు కుల వివక్షకు గురి అయ్యాము. గత 6 నెలల్లో కుల, మత, రాజకీయాలకు అతీతంగా సేవ కార్యక్రమాలు చేసాము. ఇక ముందు మేము ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం లేదు. ధన్యవాదాలు’’ అంటూ తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ఎక్స్(ట్విటర్) వేదికగా విహారి ఫౌండేషన్ ప్రకటించింది. బాబూ మీకో దండం అన్నట్లు విధిలేక క్షమాపణలు కూడా చెప్పింది. తానా అంటే తందాన అదండీ సంగతి.. పక్కోళ్ల క్రెడిట్ కొట్టేయడమే గాకుండా.. పైగా వాళ్లనే బోడి సాయం అన్న చందంగా కించపరిచి... అయినా అహం చల్లారక కుల వివక్ష చూపుతూ ట్రోల్ చేసి ఫౌండేషన్ను మూసివేయించింది పచ్చ బ్యాచ్. నలుగురికి అందే ఆ సాయమేదో అందకుండా చేసి పైశాచిక ఆనందం పొందింది. ఇప్పుడేమో హనుమ విహారి ఏవో రాజకీయాలంటూ స్పష్టమైన కారణం చూపకుండా ఆంధ్ర జట్టుకు ఆడనంటే.. అతడిపై సానుభూతి ప్రదర్శించే నాటకాన్ని రక్తికట్టించే పనిలో పడింది. ఇక టీడీపీ బాస్కు తానా అంటే తందానా అని భజన చేసే యెల్లో మీడియా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ గుండెలు బాదుకుంటోంది! అట్లుంటది మరి బా‘బోరు’.. ఆయన బ్యాచ్ పని(ప్రచార)తనం!! చదవండి: ఇంకేంటి విహారి?!.. అన్నీ నువ్వే చెప్తే ఎలా? ఆ కోతులకేమో కొబ్బరి చిప్ప! -
Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి..
Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రికీ భుయ్ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది. రంజీ తాజా ఎడిషన్ ఆరంభంలో కెప్టెన్గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది. కేవీ శశికాంత్ నాలుగు, నితీశ్రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్ 32, కరణ్ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి 43, కరణ్ షిండే 5 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్ హెబ్బర్ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఆఖర్లో గిరినాథ్రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది. ఆంధ్ర వర్సెస్ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ స్కోర్లు: ►మధ్యప్రదేశ్- 234 & 107 ►ఆంధ్రప్రదేశ్- 172 & 165. -
ఆ రోజు ద్రవిడ్ చెప్పాడు.. తర్వాత ఎవరూ టచ్లో లేరు!
Hanuma Vihari Comments: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి టీమిండియా పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మేనేజ్మెంట్ నుంచి తనకు ఇప్పటి వరకు పిలుపు రాలేదని.. ప్రస్తుతం తాను జాతీయ జట్టులో చోటు గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని పేర్కొన్నాడు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఏ జట్టు కోసమైనా వందకు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు మాత్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విహారి తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం రంజీ ట్రోఫీ మీదనే ఉందని.. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే మంచిదేనంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్తో అరంగేట్రం కాగా 2018లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టులో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు మొత్తంగా 16 మ్యాచ్లు ఆడి 839 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ(111) కూడా ఉంది. అదే ఆఖరు ఇక వన్డౌన్లో బ్యాటింగ్ చేసే విహారి ఆఖరిసారిగా 2022లో ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలం(మొత్తం 31 రన్స్) కావడంతో మళ్లీ సెలక్టర్లు అతడికి అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టిన హనుమ విహారి తాజా రంజీ సీజన్లో తొలుత ఆంధ్ర కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే, బ్యాటింగ్పై ఫోకస్ చేసేందుకు కెప్టెన్సీ వదులుకుని ప్రస్తుతం కేవలం ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆరోజు ద్రవిడ్ అదే చెప్పాడు ఇప్పటి వరకు ఈ ఎడిషన్లో ఆడిన ఐదు మ్యాచ్లలో కలిపి విహారి 365 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియాలో రీఎంట్రీ గురించి ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘మేనేజ్మెంట్తో నేను కాంటాక్ట్లో లేను. నా ఆఖరి టెస్టు తర్వాత రాహుల్ ద్రవిడ్ ఒక్కడే నాతో మాట్లాడాడు. నా ఆటలోని లోపాలను తెలియజేసి.. వాటిని అధిగమించాల్సిన ఆవశ్యకతను వివరించాడు. ఆ తర్వాత ఎవరూ టచ్లో లేరు. అయితే, ప్రస్తుతం దేని గురించి ఆలోచించకుండా.. బ్యాటింగ్ను మెరుగుపరచుకోవడంపై మాత్రమే దృష్టి సారించాను. నా దృష్టి మొత్తం బ్యాటింగ్ మీదే ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా బెస్ట్ ఇచ్చి పరుగులు రాబట్టడమే పని. కెరీర్ పరంగా ఇప్పుడు నేను ఎలాంటి ఆశలు, అంచనాలు పెట్టుకునే దశలో లేను. ఏదేతే అది జరుగుతుంది. టెస్టు జట్టులో లేనందుకు నిరాశ, బాధ ఉన్న మాట వాస్తవమే. అయినా ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఇప్పుడైతే రంజీలో వీలైనన్ని పరుగులు రాబట్టడమే పని’’ అని 30 ఏళ్ల హనుమ విహారి చెప్పుకొచ్చాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో ఎలైట్ బి గ్రూపులో ఉన్న ఆంధ్ర జట్టు ప్రస్తుతం మూడు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: #Arjun Tendulkar: సచిన్ కొడుకుకు ఏమైంది..? కనీసం ఒక్క మ్యాచ్లో కూడా
Related News by category
-
ఐపీఎల్లో నేటి (Apr 29) మ్యాచ్.. కేకేఆర్ను ఢీకొట్టనున్న ఢిల్లీ
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 29) జరుగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ను ఢీకొట్టనుంది. కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. కేకేఆర్ 17, ఢిల్లీ 15 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. కేకేఆర్ గత మ్యాచ్లో అతి భారీ స్కోర్ (261/6) చేసి కూడా పంజాబ్ చేతిలో భంగపడగా.. ఢిల్లీ తమ చివరి మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి కేకేఆర్ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంది. ఇరు జట్లు ఇదే సీజన్లో తలపడిన సందర్భంలో కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఏప్రిల్3న విశాఖ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ 166 పరుగులకే కుప్పకూలి 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో విధ్వంసకర ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేసర్పై అందరి కళ్లు ఉన్నాయి. ఫ్రేసర్ ముంబైతో ఆడిన గత మ్యాచ్లో మ్యాడ్ మ్యాన్లా రెచ్చిపోయి 27 బంతుల్లో 84 పరుగులు చేశాడు.తుది జట్లు (అంచనా)..కోల్కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా (ఇంపాక్ట్ ప్లేయర్)ఢిల్లీ: జేక్ ఫ్రేసర్-మెక్గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, రసిఖ్ సలాం (ఇంపాక్ట్ ప్లేయర్) -
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్కతా X ఢిల్లీ వేదిక: కోల్కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
సన్రైజర్స్ తడబాటు...
చెన్నై: మొన్న బెంగళూరు బౌలర్లు... ఇప్పుడేమో చెన్నై బౌలర్లు... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటర్ల ఆటల్ని సాగనివ్వలేదు. దీంతో 250 ప్లస్ స్కోర్లను అవలీలగా చేసిన హైదరాబాద్ తాజాగా 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయింది. సొంతగడ్డపై చెన్నై 78 పరుగుల తేడాతో హైదరాబాద్పై ఘనవిజయం సాధించింది. ముందుగా చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98; 10 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మిచెల్ (32 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబే (20 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. తుషార్ దేశ్పాండే (4/27) సన్రైజర్స్ ను దెబ్బ కొట్టాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షహబాజ్ (బి) భువనేశ్వర్ 9; రుతురాజ్ (సి) నితీశ్ (బి) నటరాజన్ 98; మిచెల్ (సి) నితీశ్ (బి) ఉనాద్కట్ 52; దూబే (నాటౌట్) 39; ధోని (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–19, 2–126, 3–200. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–38–1, నితీశ్ 1–0–8–0, షహబాజ్ 3–0– 33–0, నటరాజన్ 4–0–43–1, ఉనాద్కట్ 4–0–38–1, కమిన్స్ 4–0– 49–1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హెడ్ (సి) మిచెల్ (బి) తుషార్ 13; అభిõÙక్ (సి) మిచెల్ (బి) తుషార్ 15; అన్మోల్ప్రీత్ (సి) మొయిన్ అలీ (బి) తుషార్ 0; మార్క్రమ్ (బి) పతిరణ 32; నితీశ్ (సి) ధోని (బి) జడేజా 15; క్లాసెన్ (సి) మిచెల్ (బి) పతిరణ 20; సమద్ (సి) సబ్–రిజ్వీ (బి) శార్దుల్ 19; షహబాజ్ (సి) మిచెల్ (బి) ముస్తఫిజుర్ 7; కమిన్స్ (సి) మిచెల్ (బి) తుసార్ 5; భువనేశ్వర్ (నాటౌట్) 4; ఉనాద్కట్ (సి) మొయిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పత నం: 1–21, 2–21, 3–40, 4–72, 5–85, 6–117, 7–119, 8–124, 9–132, 10–134 బౌలింగ్: దీపక్ చహర్ 3–0–22–0, తుషార్ 3–0–27–4, ముస్తఫిజుర్ 2.5–0–19–2, జడేజా 4–0–22–1, శార్దుల్ 4–0–27–1, పతిరణ 2–0–17–2. -
ధీరజ్ బృందం సంచలనం
షాంఘై (చైనా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్లతో కూడిన భారత జట్టు 5–1 (57–57, 57–55, 55–53)తో సంచలన విజయం సాధించింది. తద్వారా 14 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో టీమ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. చివరిసారి భారత్ 2010 ఆగస్టులో షాంఘైలోనే జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో స్వర్ణం సాధించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ధీరజ్ –అంకిత ద్వయం కాంస్య పతకం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్లో ధీరజ్–అంకిత జోడీ 6–0 (35–31, 38–35, 39–37)తో వలెన్సియా–మతియాస్ (మెక్సికో) జంటపై నెగ్గింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో భారత స్టార్ దీపిక కుమారి 0–6 (26–27, 27–29, 27–28)తో ఆసియా క్రీడల చాంపియన్ లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకుంది. -
షూటింగ్లో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ చివరి క్వాలిఫయింగ్ షూటింగ్ టోర్నీలో భారత మహిళా స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ రజత పతకం సాధించింది. దాంతో భారత్కు 21వ ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. దోహాలో ఆదివారం జరిగిన స్కీట్ ఈవెంట్ ఫైనల్లో మహేశ్వరి ‘షూట్ ఆఫ్’లో 3–4తో ఫ్రాన్సిస్కా క్రొవెట్టో (చిలీ) చేతిలో ఓడిపోయింది. నిర్ణీత 60 షాట్ల తర్వాత ఇద్దరూ 54–54తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు.
Advertisement
Photos
View allVideo
View allబ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement