మద్యం మత్తులో మహిళ వీరంగం | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో మహిళ వీరంగం

Published Tue, Sep 30 2014 3:05 AM

A woman under the influence of alcohol virangam

బెంగళూరు : మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ మహిళపై ఇక్కడి కబ్బన్‌పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సోమవారం తెలిపిన సమాచారం మేరకు.. యలహంకలో ఏయిర్ ఫోర్స్ ఉద్యోగి భార్య, తన స్నేహితుడితో కలిసి సెయింట్ మార్క్స్ రోడ్డులోని కేఫ్ (పబ్)కు వెళ్లారు. మద్యం సేవించి బయటకు వచ్చారు. కారులో మ్యూజియం రోడ్డు మీదుగా అనీల్ కుంబ్లే సర్కిల్ వైపు రాంగ్‌రూట్లో దూసుకు వెళ్లారు.

ఆ సమయంలో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుభాష్ కారులో ఎదురుగా వచ్చాడు. కారు ఢీకొంటుందని భావించిన ఆయన ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో సుభాష్ కారు వెనుక వ స్తున్న మరో రెండు కార్లు అతని కారును ఢీకొన్నాయి. మొత్తం ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. వన్‌వేలో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కారు మరమత్తులు చేయించాలని సుభాష్ కోరాడు. అయితే ఆమె సుభాష్‌పై రెచ్చిపోయింది.
 
ట్రాఫిక్ జాం కావడంతో పలు వాహనాలు ఆగిపోయాయి. దీంతో సుభాష్ కబ్బన్‌పార్క్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె మద్యం సేవించినట్లు గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు.  ఆమె కారును సీజ్ చేశారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న అధికారి భార్య కావడంతో ఆమె పేరు చెప్పడానికి కబ్బన్‌పార్క్ ట్రాఫిక్ పోలీసులు నిరాకరించారు.

Advertisement
Advertisement