-
ఆయన రచ్చ.. అంతా ఇంతా కాదు!
గుడ్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నాయకుని వీరంగం పూటుగా మద్యం తాగి సిబ్బందిపై దౌర్జన్యం మా ప్రభుత్వంలో పనిచేయడానికి మీరెవరంటూ బయటకు గెంటిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన కందుకూరు : ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం గుళ్లపాలెం సర్పంచ్ పీకలదాకా తప్ప తాగి రెచ్చిపోయాడు. మద్యం మత్తులో మండల పరిషత్ కార్యాలయ అధికారులను తూలనాడాడు. ఆయన బారి నుంచి రక్షణ కల్పించాలని ఉద్యోగులు సోమవారం పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు పొక్కింది. వివరాలు.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం.. సమయం ఏడు గంటలు. ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ జయమణితో పాటు సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, జూనియర్ అసిస్టెంట్ చరణ్కుమార్ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకుట్టు సంఘం చైర్మన్, గుళ్లపాలెం సర్పంచ్ బొబ్బూరి నాగేశ్వరరావు పూటుగా మద్యం తాగి ఎంపీడీఓ కార్యాలయంలోకి ప్రవేశించాడు. కార్యాలయంలోకి వెళ్తూనే ఎంపీడీఓని నోటికొచ్చినట్లు దుర్బాషలాడుతూ విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యానికి దిగాడు. ఈ ప్రభుత్వం మాది మీరెవరూ ఇక్కడ పనిచేయడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. జూనియర్ అస్టెంట్ చేతిలో ఉన్న కీబోర్డును నేలకేసి బాదాడు. రాయలేని భాషలో దుర్బాషలాడుతూ విధుల్లో ఉన్న ముగ్గురు సిబ్బందిని కార్యాలయం నుంచి బయటకు గెంటేశాడు. ఈ హఠాత్పరిణామంతో సిబ్బంది వణికిపోయూరు. అధికార పార్టీ నాయకుడు కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి. నాలుగు రోజులైనా ఆందోళన వీడకపోవడంతో సర్పంచ్ బారి నుంచి రక్షించాలని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగులమైన తమపై దౌర్జన్యం చేయడమే కాక, విధులకు ఆటంకం కలిగించి దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని ఎస్సై విజయచందర్ తెలిపారు. నాగేశ్వరరావు గతంలోనూ ఇదే రీతిన ప్రవర్తించాడు. అధికార పార్టీ నేత కావడంతో ఫిర్యాదు చేసేందుకు అప్పట్లో సిబ్బంది ముందుకు రాలేదు. ఈయన ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుండటంతో విసుగు చెందిన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
భార్య, పిల్లలపై ఏఆర్ కానిస్టేబుల్ దాడి
అనంతపురం క్రైం : చట్టాన్ని సంరక్షిస్తూ.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన గురుతర బాధ్యతతో వ్యవహరించాల్సిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ అదనపు కట్న దాహంతో వీరంగం సృష్టించాడు. పది మందికీ ఆదర్శంగా నిలవాల్సిన ఆ పోలీసు తన భార్య, పిల్లలతో పాటు అత్తపై దాడి చేసి బీభత్సం చేశాడు. శుక్రవారం నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండల కేంద్రం లేపాక్షికి చెందిన వీరన్న(1136) ఏఆర్ కానిస్టేబుల్. ప్రస్తుతం డీపీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు నగరంలోని రంగస్వామినగర్ యువజన కాలనీకి చెందిన దంపతులు వెంకటలక్ష్మీ, శివశంకర్ల కుమార్తె పార్వతితో 2004లో వివాహమైంది. అప్పుడు రూ. రూ.లక్షన్నర నగదు, 20 తులాల బంగారం ఇచ్చారు. అనంతరం వీరు యువజన కాలనీలోనే కాపురం ఉంటున్నారు. వీరికి కుమారుడు అభిరామ్(9), కూతురు దుర్గ(7) ఉన్నారు. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి.. ఆడపిల్ల పుట్టబోతోందంటూ అదనపు కట్నం కోసం వీరన్న భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఓసారి రూ. 50 వేలు ఇచ్చినట్లు పార్వతి తల్లి తెలిపింది. దుర్గ పుట్టగానే వేధింపులు అధికమయ్యాయి. కనీసం ఇంటి బాడుగ, ఇతర అవసరాలకు పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడు. పేకాట, జూదం, వ్యసనాలకు అలవాటు పడ్డ వీరన్న కుటుంబాన్ని పూర్తిగా వదిలేశాడు. విధిలేక పార్వతి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ పిల్లల్ని పోషించుకుంటోంది. ఇటీవల దసరా పండుగ సందర్భంగా పార్వతి తన పుట్టింటికి వెళ్లగా, వీరన్న లేపాక్షికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం అతను, తన బంధువులు వెంకటేశు, కామాక్షి, పద్మ, మురుగేష్, దుర్గేష్, ఓబుళమ్మ, తదితరులతో కలిసి అత్తగారింటికి వచ్చాడు. భార్యను పిలిచి ఇంటి తాళం చెవి అడిగాడు. దీంతో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో వీరన్నతో పాటు అతని బంధువులు ఇంటిపై దాడికి దిగారు. విచక్షణారహితంగా భార్య, పిల్లలు, అత్తను దొరకబుచ్చుకుని కొట్టారు. మరో ఇద్దరు కూతుళ్లనూ కొట్టారు. అంతటితో ఆగక పార్వతి తల్లి వెంకటలక్ష్మీ మెడలోని బంగారు చైను లాక్కున్నారు. బాధితులందరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను పోలీసునని, ఏ స్టేషన్కు వెళ్లినా కేసు నమోదు చేయరంటూ తరచూ వీరన్న చెప్పేవాడని బాధితులు రోదించారు. తమపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే వారు పట్టించుకోలేదని బంధువులు వాపోయారు. -
మద్యం మత్తులో మహిళ వీరంగం
బెంగళూరు : మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ మహిళపై ఇక్కడి కబ్బన్పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సోమవారం తెలిపిన సమాచారం మేరకు.. యలహంకలో ఏయిర్ ఫోర్స్ ఉద్యోగి భార్య, తన స్నేహితుడితో కలిసి సెయింట్ మార్క్స్ రోడ్డులోని కేఫ్ (పబ్)కు వెళ్లారు. మద్యం సేవించి బయటకు వచ్చారు. కారులో మ్యూజియం రోడ్డు మీదుగా అనీల్ కుంబ్లే సర్కిల్ వైపు రాంగ్రూట్లో దూసుకు వెళ్లారు. ఆ సమయంలో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి సుభాష్ కారులో ఎదురుగా వచ్చాడు. కారు ఢీకొంటుందని భావించిన ఆయన ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో సుభాష్ కారు వెనుక వ స్తున్న మరో రెండు కార్లు అతని కారును ఢీకొన్నాయి. మొత్తం ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. వన్వేలో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కారు మరమత్తులు చేయించాలని సుభాష్ కోరాడు. అయితే ఆమె సుభాష్పై రెచ్చిపోయింది. ట్రాఫిక్ జాం కావడంతో పలు వాహనాలు ఆగిపోయాయి. దీంతో సుభాష్ కబ్బన్పార్క్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె మద్యం సేవించినట్లు గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమె కారును సీజ్ చేశారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న అధికారి భార్య కావడంతో ఆమె పేరు చెప్పడానికి కబ్బన్పార్క్ ట్రాఫిక్ పోలీసులు నిరాకరించారు. -
అర్ధరాత్రి కత్తితో వీరంగం
సిఫ్కాట్: హోసూరు ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తమిళనాడు విశ్వహందూ పరిషత్ నాయకుడు శశి బుధవారం అర్ధరాత్రి హోసూరు ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని అశోక్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ పనిచేస్తున్న ప్రకాష్ అనే ఉద్యోగిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ప్రకాష్ అప్రమత్తమై చెయ్యి అడ్డం పెట్టడంతో అతని చేతికి బలమైన దెబ్బ తగిలింది. తమిళనాడు వీహెచ్పీ నాయకుడు శశి తాగిన మైకంలో ఆస్పత్రిలోకి చొరబడి పెద్ద కత్తితో అందరినీ బెదిరించి, అడ్డుకోబోయిన ప్రకాష్పై దాడి చేశాడని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. శశి ఆస్పత్రిలోకి చొరబడి కత్తితో సిబ్బందిని బెదిరించడం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిని కత్తితో బెదిరించిన వీహెచ్పీ నాయకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అలాగే పెళ్లి కూడా చేసిపెట్టమని అడగండి మేడం!
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్లో మెరిసిందా?
రెడ్ కార్పెట్పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
టీడీపీ అరాచకం.. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement