నవంబర్ 22న కోర్టుకు హాజరుకండి | Sakshi
Sakshi News home page

నవంబర్ 22న కోర్టుకు హాజరుకండి

Published Wed, Oct 30 2013 4:01 AM

ANJALI SUMMONED TO ATTEND COURT ON NOVEMBER 22

తమిళసినిమా, న్యూస్‌లైన్ :  నటి అంజలి నవంబర్ 22న కోర్టుకు తప్పని సరిగా హాజరు కావాలని సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నటి అంజలి తమిళంలో అంగాడి తెరు చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఈమె ఆ మధ్య దర్శకుడు కలైంజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చెన్నై సైదాపేట కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు పలుమార్లు విచారణకు వచ్చినా అంజలి కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసు మంగళవారం ఉదయం మరోసారి విచారణకు వచ్చింది. దర్శకుడు కలైంజయం హాజరై వివరణ ఇచ్చారు. నటి అంజలి ఈ సారి కూడా కోర్టుకు రాలేదు. ఆమె తరపు న్యాయవాది మహా నాథన్ హాజరై నటి అంజలి అనారోగ్యం కారణంగా కోర్టుకు రాలేదని, అందుకు సంబంధించిన డాక్టర్ సర్టిఫికెట్‌ను కోర్టులో సమర్పించా రు. న్యాయమూర్తి రాజ్యలక్ష్మి అంజలి న్యాయవాది వివరణతో సంతృప్తి చెందలేదు. ఈ కేసు విచారణను నవంబర్ 22కు వాయిదా వేస్తూ ఆ రోజున నటి అంజలి తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
 

Advertisement
Advertisement