న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కపిల్సిబల్ కుమారుడు అమిత్ దాఖలుచేసిన పరువునష్టం కేసుకు సంబంధించి స్థానిక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పై శనివారం అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సునీల్కుమార్ శర్మ... అర వింద్తోపాటు అదే పార్టీకి చెందిన ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మీలపై కూడా అభియోగాలను నమోదు చేశారు. కాగా కపిల్ సిబల్ ....కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఆయన కుమారుడైన అమిత్ సిబల్ ... వోడా ఫోన్ సంస్థ తరఫున కోర్టుకు హాజరయ్యారు. తన వాదనలను వినిపించాడు. ఈ విషయాన్ని2013లో జరిగిన మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో సమావేశంలో ప్రస్తావించారు.
దీంతో అమిత్ సిబల్... అరవింద్ కేజ్రీవాల్పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. అమిత్ పిటిషన్ను పరిశీలించడంతోపాటు అతని తరఫు లాయర్ వాదనలను ఆలకించిన కోర్టు... ఈ మేరకు అభియోగాలను నమోదుచేసింది. ఈ కేసుకు సంబంధించి వచ్చే సంవత్సరం జనవరి 17వ తేదీన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనుంది. మరోవైపు అరవింద్పై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకూడా కొన్నాళ్లక్రితం పరువునష్టం కేసును దాఖలు చేసిన సంగతి విదితమే. మ్ ఆద్మీ పార్టీ గతంలో విడుదల చేసిన అత్యంత అవినీతిపరుల జాబితాలో తన పేరును చేర్చడంపై తీవ్ర ఆగ్రహానికిలోనైన గడ్కరీ.. తనపై మోపిన అభియోగాలను ఉపసంహరించుకుంటూ ఓ ప్రకటన విడుదల చేయాలని కేజ్రీవాల్ను నితిన్ కోరారు. అలా అయితే ఈ కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
అయితే ఇందుకు కేజ్రీవాల్ అంగీకరించలేదు. దీంతో గడ్కరీ...ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పరువునష్టం దాఖలుచేశారు. సదరు పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం ఈ ఏడాది ఆగస్టు రెండో తేదీన అరవింద్పై అభియోగాలు నమోదు చేసింది. ఇద్దరూ ఒకచోట కూర్చుని ఈ వివాదాన్ని పరిష్కరించాలని అంతకుముందు కోర్టు సూచించింది. ఇద్దరూ రాజీకి రాలేదు. దీంతో ఈ కేసుకు సంబంధించి కూడా కోర్టు అప్పట్లో అరవింద్పై అభియోగాలను నమోదుచేసింది. ఈ కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ కేజ్రీవాల్ చేసిన విన్నపానికి కోర్టు అంగీకారం తెలిపిన సంగతి విదితమే.
పరువు నష్టం కేసు అరవింద్పై అభియోగాలు
Published Sat, Sep 20 2014 11:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement