న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకట్టుకునే ందుకు బీజేపీ... అనేక విధాలుగా యత్నిస్తోంది. ఇందులోభాగంగా ప్రచార రంగంలోకి సెలబ్రిటీ ఎంపీలు హేమమాలిని, శత్రుఘన్సిన్హా, వినోద్ఖన్నా, స్మృతి ఇరానీలను దించనుంది. వీరంతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఎన్నికల ప్రచారం కోసం మొత్తం 18 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కమల దళం సిద్ధం చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తదితరులు ఉన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ నిర్వహించే ర్యాలీలను తలదన్నేరీతిలో తమ ప్రచారం సాగాలని బీజేపీ భావిస్తోంది. సెలబ్రిటీ ఎంపీలైన హేమమాలిని, శత్రుఘన్సిన్హా, వినోద్ఖన్నా, స్మృతి ఇరానీలను రంగంలోకి దించితేనే ఇది సాధ్యమవుతుందనేది తమ ఆలోచన అని ఆ పార్టీ నాయకుడొకరు వెల్లడించారు.
ఇటీవల నగరంలో జరిగిన సమావేశాల్లోనూ వీరంతా పాల్గొన్నారని, వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా ఓటర్లను ఆకట్టుకుని గరిష్ట లబ్ధి పొందడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు. కాగా సెలబ్రిటీ ఎంపీల జాబితాలో ఈశాన్య ఢిల్లీ ఎంపీ, భోజ్పురి గాయకుడు మనోజ్తివారీ పేరు కూడా ఉంది. 16 ఏళ్ల సుదీర్ఘన విరామం తర్వాత ఈసారి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకుగల ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోవడం లేదు. ఇందులోభాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఈ నెల పదో తేదీన నగరంలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ సభలో హరియాణా, జార్ఖండ్, మహారాష్ర్ట ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారానికి సెలబ్రిటీ ఎంపీలు
Published Sun, Jan 4 2015 10:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement