చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాణాపాయకరమైన మెదడు ఉబ్బే వ్యాధికి శస్త్రచికిత్స చేయడం ద్వారా చెన్నైలోని మియట్ ఆసుపత్రి వైద్యులు ఓ వృద్ధురాలికి ప్రాణం పోశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి చైర్పర్సన్ మల్లికా మోహన్దాస్, వైద్యులు విశ్వనాథ్, మురళీ మాట్లాడారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సలియమ్మ(60) పదేళ్లుగా సాధారణ తలనొప్పికి తరచూ గురయ్యేది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన అకస్మాత్తుగా తట్టుకోలేని తలనొప్పికి గురైంది. వెంటనే బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా మెదడు భాగంలో రక్తం స్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే అతి సున్నితమైన భాగంలో సమస్య ఉన్నందున శస్త్రచికిత్స చేయలేమని చేతులెత్తేశారు.
అలా నెల్లూరులోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో కొందరి సలహామేరకు ఈనెల 3వ తేదీన చెన్నై మియట్ ఆ సుపత్రిలో రోగి పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ యన్యూర్సమ్ అనే మెదడు ఉబ్బే వ్యాధి బైటపడింది. ఈ వ్యాధి కారణంగా రోగి మెదడులోని రక్తనాళాలు పగిలి రక్తస్రావం సంభవిస్తున్నట్లు తెలుసుకున్నారు. అత్యంత సున్నితమైన ప్రదేశం కావడంతో డాక్టర్లు మురళీ, విశ్వనాద్లు ఒక సవాల్గా స్వీకరించారు. ఈనెల 8వ తేదీన య న్యూర్సమ్ క్లిప్పింగ్అనేశస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.
రిస్క్ చేసి ప్రాణం పోశాం: చైర్పర్సన్ మల్లికా మోహన్దాస్
మెదడు వ్యాధి పైగా రక్తనాళాల నుంచి రక్తస్రావం కావడంతో శస్త్రచికిత్స చేయడంలో ఎంతో సాహసం చేశామని మియట్ ఆసుపత్రి చైర్పర్సన్ మల్లికా మోహన్దాస్ చెప్పారు. ఈరోగానికి గురైన ముగ్గురిలో ఒకరు చికిత్స చేసేలోగానే మృతి చెందుతారని ఆమె చెప్పారు. చికిత్స లభించినా, లభించకున్నా 25 శాతం రోగులు 24 గంటల్లోగా మరణిస్తారని ఆమె తెలిపారు. అయితే సలియమ్మకు శస్త్రచికిత్స చేసి నేటికి 16 రోజులు పూర్తికాగా ఆమె కోలుకున్నారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో సర్జన్ల బృందం ఆరుగంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు.
భగవంతుడు సరైన ఆసుపత్రికి చేర్చాడు: సలియమ్మ నెల్లూరులోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి ప్రాణాలు వదులు కోక తప్పదని భావిస్తున్న తరుణంలో భగవంతుడు తనను సరైన ఆసుపత్రికి చేర్చాడని సలియమ్మ తెలిపారు. తీవ్రమైన తలనొప్పికి గురై క్రమేణా కళ్లు కనిపించకుండా పోయాయని, ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోతున్నట్లు గుర్తించి బంధువులను కేకలు వేసి పిలిపించుకున్నానని తెలిపారు. స్పృహ కోల్పోయిన స్థితిలోనే మియట్లో చేర్చారని అన్నారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రాణం పోసిన మియట్ ఆసుపత్రికి రుణపడి ఉన్నానని ఆమె చెప్పారు.
ప్రాణం పోసిన మియట్
Published Thu, Mar 24 2016 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement