-
ఆస్పత్రి నుంచి నటుడు విజయకాంత్ డిశ్చార్జ్
కోలీవుడ్లో కొద్దిరోజుల క్రితం ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యానికి గురైయారు. ఈ కారణంగా చెన్నైలోని మియత్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట పలు ఊహాగానాలు వచ్చిన సమయంలో ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. దగ్గు,జలుబు కారణంతో ఆస్పత్రిలో విజయకాంత్ చేరారు. చికిత్స అందిస్తున్న క్రమంలో శ్వాసకోస సంబంధిత సమస్యలను ఆయన ఎదుర్కొన్నారు. సుమారు 20 రోజులకు పైగనే ఆయన చికిత్స పొందారు. విజయకాంత్ ఆరోగ్యంపై పలు రూమర్స్ రావడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఆయన సతీమణి ప్రేమలత కూడా వీడియో ద్వారా కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రకటించారు. ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా ఉండడంతో మరో 14 రోజుల పాటు విజయకాంత్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. నేడు (డిసెంబర్ 11)న మయత్ హాస్పిటల్ నుంచి విజయకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. -
ప్రాణం పోసిన మియట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాణాపాయకరమైన మెదడు ఉబ్బే వ్యాధికి శస్త్రచికిత్స చేయడం ద్వారా చెన్నైలోని మియట్ ఆసుపత్రి వైద్యులు ఓ వృద్ధురాలికి ప్రాణం పోశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి చైర్పర్సన్ మల్లికా మోహన్దాస్, వైద్యులు విశ్వనాథ్, మురళీ మాట్లాడారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సలియమ్మ(60) పదేళ్లుగా సాధారణ తలనొప్పికి తరచూ గురయ్యేది. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన అకస్మాత్తుగా తట్టుకోలేని తలనొప్పికి గురైంది. వెంటనే బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా మెదడు భాగంలో రక్తం స్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే అతి సున్నితమైన భాగంలో సమస్య ఉన్నందున శస్త్రచికిత్స చేయలేమని చేతులెత్తేశారు. అలా నెల్లూరులోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో కొందరి సలహామేరకు ఈనెల 3వ తేదీన చెన్నై మియట్ ఆ సుపత్రిలో రోగి పరీక్షలు నిర్వహించగా బ్రెయిన్ యన్యూర్సమ్ అనే మెదడు ఉబ్బే వ్యాధి బైటపడింది. ఈ వ్యాధి కారణంగా రోగి మెదడులోని రక్తనాళాలు పగిలి రక్తస్రావం సంభవిస్తున్నట్లు తెలుసుకున్నారు. అత్యంత సున్నితమైన ప్రదేశం కావడంతో డాక్టర్లు మురళీ, విశ్వనాద్లు ఒక సవాల్గా స్వీకరించారు. ఈనెల 8వ తేదీన య న్యూర్సమ్ క్లిప్పింగ్అనేశస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. రిస్క్ చేసి ప్రాణం పోశాం: చైర్పర్సన్ మల్లికా మోహన్దాస్ మెదడు వ్యాధి పైగా రక్తనాళాల నుంచి రక్తస్రావం కావడంతో శస్త్రచికిత్స చేయడంలో ఎంతో సాహసం చేశామని మియట్ ఆసుపత్రి చైర్పర్సన్ మల్లికా మోహన్దాస్ చెప్పారు. ఈరోగానికి గురైన ముగ్గురిలో ఒకరు చికిత్స చేసేలోగానే మృతి చెందుతారని ఆమె చెప్పారు. చికిత్స లభించినా, లభించకున్నా 25 శాతం రోగులు 24 గంటల్లోగా మరణిస్తారని ఆమె తెలిపారు. అయితే సలియమ్మకు శస్త్రచికిత్స చేసి నేటికి 16 రోజులు పూర్తికాగా ఆమె కోలుకున్నారని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూరో రేడియాలజిస్టులు, న్యూరో సర్జన్ల బృందం ఆరుగంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. భగవంతుడు సరైన ఆసుపత్రికి చేర్చాడు: సలియమ్మ నెల్లూరులోని అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి ప్రాణాలు వదులు కోక తప్పదని భావిస్తున్న తరుణంలో భగవంతుడు తనను సరైన ఆసుపత్రికి చేర్చాడని సలియమ్మ తెలిపారు. తీవ్రమైన తలనొప్పికి గురై క్రమేణా కళ్లు కనిపించకుండా పోయాయని, ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోతున్నట్లు గుర్తించి బంధువులను కేకలు వేసి పిలిపించుకున్నానని తెలిపారు. స్పృహ కోల్పోయిన స్థితిలోనే మియట్లో చేర్చారని అన్నారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రాణం పోసిన మియట్ ఆసుపత్రికి రుణపడి ఉన్నానని ఆమె చెప్పారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement