హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడికెళ్లినా, ఎక్కడ ఉన్నా హంగులు ఆర్బాటాలు తప్పవు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు వారుండటానికి కేంద్ర ప్రభుత్వం వసతి కోసం భవనాలను కేటాయిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ఉండటానికి 1 జనపథ్ లో ఒక భవనాన్ని కేటాయించింది.
ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ భవనం కేటాయించగా, తన స్థాయికి తగినట్టుగా ఆ భవనంలో హంగులు లేవని భావించినట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యమన్నట్టు ఆ భవనంలో సర్వ హంగులు ఏర్పాటు చేయడానికి రిపేర్ల పేరుతో ఒకటి కాదు రెండు కాదు... ప్రభుత్వం ఏకంగా 5.82 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం (జీవో 2209) ఉత్తర్వులు జారీ చేసింది. 5.82 కోట్ల రూపాయలంటే... అతి పెద్ద కొత్త భవనమే నిర్మించొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రిపేర్ల కోసం భారీ మొత్తం విడుదల చేయడం విస్మయపరుస్తోంది.
ఇదొక్కటే కాదు.. గతంలో కూడా లేక్వ్యూ కోసం సుమారు రూ.5కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు మదీనా గూడలో కనీసం నెల రోజులు కూడా ఉండని ఓ ప్రైవేటు నివాసం కోసం రూ.1.32కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అలాగే, హైదరాబాద్లోని పార్క్ హయత్ లో నివాసానికి ప్రజాధనం ఉపయోగించారు. ప్రతి నెల లక్షలాది రూపాయల అద్దెను చెల్లించారు. ఇక విజయవాడలోని లింగమనేని అక్రమనివాసానికి భారీగా నిధులు వెచ్చించడమే కాకుండా ఇక్కడ రోడ్లు, భద్రతా ఏర్పాట్లకోసం రూ.30కోట్లు ఖర్చు చేశారు.
విజయవాడలో తాత్కాలిక క్యాంపు కార్యాలయానికి రూ.40కోట్లు వెచ్చించారు. ప్రత్యేక విమానం కోసం ప్రతి నెలా రూ.2కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే విమాన ప్రయాణాలకోసం సుమారు రూ.60కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఓపక్క ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో ఉందంటూనే అన్ని రకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీలో బాబు ఇంటి రిపేర్లకు 5.82 కోట్లు
Published Thu, Oct 27 2016 7:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement