బెంగళూరు: బెంగళూరులోని ఒక మెట్రో రైల్వే స్టేషన్లో సంస్థ ఉద్యోగిపై జవాను దాడి చేశాడు. కర్ణాటక పారిశ్రామిక భద్రతా దళం(కేఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ ఘర్షణ తో మైట్రో రైల్ సర్వీసులు కొన్ని గంటలసేపు స్తంభించిపోయాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు ఈ బంద్ కాగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలీవి.. గురువారం మధ్యాహ్నం సిటీ సివిల్ కోర్టు ఎదురుగా ఉన్న విశ్వేశ్వరయ్య మెట్రో స్లేషన్లో కేఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆనంద్, లక్ష్మణ్, భారతి విధుల్లో ఉన్నారు. మెట్రో ఉద్యోగి రాకేశ్ బ్యాగుతో స్టేషన్లోకి ప్రవేశించగా బ్యాగ్ను తనిఖీ చేయాలని ఆనంద్ ఆయనను ఆపారు. తాను మెట్రో సిబ్బందిని, తనిఖీ అవసరం లేదని రాకేశ్ సూచించారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కానిస్టేబుల్ ఆనంద్ ఆవేశం పట్టలేక ఉద్యోగిపై పిడిగుద్దులు కురిపించారు. ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ ఘర్షణ అక్కడ సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఆగ్రహం చెందిన రాకేశ్ ఇతర మెట్రో స్టేషన్లలో పని చేస్తున్న 40 మంది సహచర ఉద్యోగులను పిలిపించి కానిస్టేబుళ్లు ఆనంద్, లక్ష్మణ్, భారతీలపై దాడి చేశారు. అక్కడి నుంచి తప్పించుకున్న కానిస్టేబుళ్లు హలసూరు గేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాకేశ్తో పాటు మరో 40 మంది మెట్రో సిబ్బందిపై గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు.
సిబ్బంది ఆందోళన.. చర్చలు
తమపై కేసులు బనాయించారంటూ శుక్రవారం ఉదయమే బెంటళూరులోని మొత్తం మెట్రో రైల్వే ఉద్యోగులు విధులను బహిష్కరించి బయపపనహళ్లి మెట్రో స్టేషన్లో బైఠాయించారు. దీంతో ఎక్కడవక్కడే రైళ్లు ఆగిపోయాయి. ఏం జరిగిందో తెలియక వేలాది మంది ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. మొదట విధులకు హాజరు కావాలని తరువాత మిగిలిన విషయాలు చర్చించుకుందామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇకపై ఇలాంటివి పురరావృతం కానివ్వరాదని ఇరు వర్గాలకూ సూచించారు. విధులకు హాజరు కాకపోతే ఎస్మా ప్రయోగిస్తామని మెట్రో సిబ్బందిని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో సిబ్బంది విధులకు హాజరయ్యారు, ఉదయం 11:30 తర్వాత మెట్రో రైళ్లు సర్వీసులు నడిచాయి.
బ్యాగ్ను తనిఖీ చేయాలని ఆపారు.. అంతోలోనే
Published Fri, Jul 7 2017 7:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement