సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగాముందుకు సాగుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో పరుగులు తీస్తున్నాయి. ఒకదానికి మరొకటి పోటీపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసింది. ఇక బీజేపీ విషయానికొస్తే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వే చేయిస్తోంది. ఇప్పటిదాకా ఎన్నికల సన్నాహాల్లో వెనుకబడినట్లుగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. క్రిస్మస్ కంటే ముందే తొలి జాబితా వెలువడుతుందని ఆ పార్టీ ఢిల్లీ శాఖ ఇంచార్జి పీసీ చాకో చెబుతున్నారు. అభ్యర్థుల పేర్ల పరిశీలనకోసం ఢిల్లీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశం కానుంది. డిసెంబర్ 20 నాటికి ఈ కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తుందని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదముద్ర వేసిన తర్వాతజాబితా విడుదల వుతుందని చాకో చెప్పారు.
కాంగ్రెస్ టికెట్ కోసం 1,100లకు పైగా దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీ ఆదివారంతో ముగిసింది. తొలుత ఈ నెల 20వ తేదీని తుది గడువుగా ప్రకటించినప్పటికీ 14కు కుదించారు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఈసారి తగ్గింది. గత ఎన్నికల సమయంలో ఈ పార్టీ టికెట్ల కోసం 1,700 దరఖాస్తులు వచ్చాయి. ఈ పరిణామం ఎన్నికల పట్ల కార్యకర్తలలో ఉత్సాహలేమిని సూచిస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు. టికెట్ కోసం దరఖాసు ్తచేసుకున్నవారిలో ప్రముఖఱ నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు. గత విధానసభ ఎన్నికలలో గెలిచిన పార్టీ అభ్యర్థులదరికీ ఈ ఎన్నికల్లో టికెట్ లభిస్తుందని వారు చెప్పారు. అయితే పరాజయం పాలైన ముఖేష్ శర్మ, డా. ఎ.కె.వాలియా, ముఖేష్ శర్మ వంటి సీనియర్ నేతలకు కూడా టికెట్ ఇచ్చే అవకాశముంది. ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచినవారి పేర్లను పరిశీలిస్తారని అంటున్నారు. మాజీ ఎంపీలలో మహాబల్ మిశ్రా ద్వారకా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. కృష్ణతీరథ్ లేదా ఆమె కుమార్తెను పటేల్నగర్ నుంచి నిలబెట్టొచ్చని తెలుస్తోంది.
నియామకం
నగర పరిధిలోని 14 జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. పరిశీలకుల జాబితాకు కాంగ్రెస్ అధిష్టానం ఆమోదముంద్ర వేసిందని అంటున్నారు. హర్యానా, రాజస్థాన్ తదితర పొరుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలను పరిశీలకులుగా నియమించారు. బూత్స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయడం కోసం పార్టీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించొచ్చని చెబుతున్నారు.
పోటీకి బహుదూరం ?
ఇదిలా ఉండగా తానుగానీ తన కుటుంబసభ్యులు, బంధువులు గానీ విధానసభ ఎన్నికల బరిలో దిగేందుకు సుముఖంగా లేమని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి షీలాదీక్షిత్ కుమార్తెను ఎన్నికల బరిలోకి దింపవచ్చని, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఎన్నికలలో పోటీ చేయడానికి తాము సిద్ధంగా లేమని షీలాదీక్షిత్ తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికలలో పోటీ చేయకపోయినప్పటికీ పార్టీ తరపున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్లు షీలాదీక్షిత్ అధిష్టానానికి తెలిపారని అంటున్నారు.
గెలుపు, ఓటములపై జోరుగా పందాలు
ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినప్పటికీ పందాలు మాత్రం జోరందుకున్నాయి. విధానసభ ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములపై సంపన్న కాలనీల నుంచి అనధికారకాలనీలు, పునరావాసకాలనీలు, జుగ్గీ జోపిడీల వరకు విస్తరించిన సట్టా బజార్లో వివిధ వర్గాలకు చెందిన ్రజ్రలు జోరుగా పందాలు కాస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇటువంటి వారి సంఖ్య వేలల్లోనే ఉంటోందని అంటున్నారు. తమ స్థితిని మెరుగుపరచుకోవడం కోసం కొందరు నేతలు ఇలాంటి పోటీలకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విధానసభ అభ్యర్థుల ఎంపికలో పార్టీలు పోటాపోటీ
Published Mon, Dec 15 2014 11:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement