సాక్షి, న్యూఢిల్లీ: ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాను ప్రభుత్వ వెబ్సైట్లలో ఉంచి భాగస్వాముల అభిప్రాయాలను కోరాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్ణయించింది.వినియోగదారులకు అత్యంత అనుకూలంగా ఉండే ఈ నోటిఫికేషన్ను త్వరగా విడుదల చేయాలని మంత్రి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న భవన నిర్మాణ నిబంధనలు 1983 నుంచి అమల్లో ఉన్నాయి. అయితే అవి ఎవరికీ అనుకూలంగా లేవని భావిస్తున్నారు. కాగా మంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత శాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ మంగళవారం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వైస్చైర్మన్, కార్యదర్శితో పాటు ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ) అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.
డీయూఏసీ... 2013 జన వరిలో రూపొంది ంచిన ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాను పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, డీడీఏ, డీయూఏసీ వెబ్సైట్లలో రెండువారాలపాటు ఉంచి అందరి సూచనలు, సలహాలతోపాటు వారి వ్యాఖ్యలను కూడా కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆ తరువాత నిపుణులు, ఆర్కిటెక్టులు, పౌరసంస్థలతోపాటు వాటాదారులందరితో ఓ వర్క్షాపును నిర్వహిస్తారు. ఆవిధంగా అందిన సూచనలు, సలహాలను ఏకీకృత భవన నిర్మాణ నిబంధనల ముసాయిదాలో చేరుస్తారు, దానిని పరిశీలనకోసం నిపుణుల కమిటీకి పంపుతారు. భవన నిర్మాణ నిబంధనలపై పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన నోటిఫికేషన్ మూడు నెలల్లోగా వెలువడుతుందని భావిస్తున్నారు.
ప్రతి పాదిత నిబంధనలు భవన నిర్మాణాలకు అనుమతులను పొందే పద్ధతిని సరళీకరించడంతో పాటు వాటిని వినియోగదారులకు సన్నిహితంగా మారుస్తాయని అంటున్నారు. దీంతోపాటు పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తాయని అంటున్నారు. ఇంధన పొదుపును కూడా ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా భవన నిర్మాణానికి అనుమతించాల్సి ఉంది. అయితే కఠినమైన నియమనిబంధనల కారణంగా ఆశించినంత సులువుగా జరగడం లేదు. కాగా ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ (డీయూఏసీ) ఈ నిబంధనలను రూపొందించిన సంగతి విదితమే.
సత్వరమే నోటిఫికేషన్
Published Tue, Oct 7 2014 11:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
Advertisement