బాధితులకు ఎల్జీ భరోసా
సహాయక చర్యలు ముమ్మరం చేసిన సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిప్రమాద బాధితులకు అన్ని రకాల తక్షణ సహాయం అదించాలని ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని బాధితులకు ఎల్జీ భరోసా ఇచ్చారు. శుక్రవారం ఉదయం వసంత్కుంజ్ సమీపంలోని మసూద్పురా జుగ్గీజోపిడీలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎల్జీ సందర్శించారు.
ప్రమాద బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరఫున సహాయం అందుతుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే 35 ఫైర్ఇంజిన్లను సంఘటనా స్థలానికి పంపినట్టు డిప్యూటీ కమిషనర్ ఎల్జీకి వివరించారు.
క్షతగాత్రుల కోసం 12 అంబులెన్స్లను, వైద్య సిబ్బందిని హుటాహుటిన రప్పించినట్టు వారు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటల్లో చిక్కుకొని గాయపడిన ఎనిమిది మందిని దగ్గరలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. గుడిసెలు కాలిపోయి నిరాశ్రయులైన వారందరికీ తక్షణమే వసతి సదుపాయాలు కల్పించాలని ఎల్జీ ఆదేశించారు. సంఘటన స్థలానికి సమీపంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి, 24 గంటల పాటు వైద్య సహాయం అందించాలని చెప్పారు.
బాధితులకు మంచినీరు, ఆహార ప్యాకెట్లు సరఫరా చేయాలని సూచించారు. అవసరం మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని డిప్యూటీ కమిషనర్కి చెప్పారు. క్షతగాత్రులందరికీ ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ఎల్జీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఎల్జీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం వరకు సహాయ శిబిరాల వద్ద పది మంచినీటి ట్యాంకర్లు, ఎంసీడీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. బాధితులకు భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఐఏఎస్ ప్రొబెషనరీ అధికారులు సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.
అన్నివిధాలా ఆదుకుంటాం
Published Fri, Apr 25 2014 11:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement