139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు | Sakshi
Sakshi News home page

139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు

Published Sat, Dec 3 2016 2:04 AM

139కి ఫోన్ చేస్తే కూలీ, ట్యాక్సీ సేవలు

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు 139కి ఫోన్ చేసి కూలీ, ట్యాక్సీలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ల నుంచి ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణించే వారికి ఈ సేవలు నిర్ణీత రుసుముపై లభిస్తారుు. టికెట్లు రిజర్వు చేసుకునే సమయంలో పై సేవలు అందుబాటులో ఉన్న రైళ్లు, స్టేషన్ల వివరాలు కనబడుతాయని ఐఆర్‌సీటీసీ చైర్మన్ ఏకే మనోచ తెలిపారు.

Advertisement
Advertisement