వెప్పమ్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన మహిళా దర్శకురాలు అంజనా. దర్శకుడు గౌతమ్మీనన్ శిష్యురాలైన ఈమె దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో నాని, నిత్యామీనన్, కార్తీక్కుమార్, బిందుమాధవి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు అంజనా. ఈ చిత్రంలో రాహుల్ హీరోగా నటించనున్నారు. పల్లాండు వాళ్గ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉంటుంద ని ఆమె చెబుతున్నారు. కృతిక ఉదయనిధి స్టాలిన్ దర్శకత్వం వహించిన వణక్కం చెన్నై చిత్రం తరువాత రాహుల్ రవీంద్రన్ నటించనున్న చిత్రం ఇది. ఈ చిత్ర కథ చాలా కొత్తగా ఉందని తన పాత్ర కూడా వెరైటీగా ఉండడంతో వెంటనే నటించడానికి అంగీకరించినట్లు రాహుల్ తెలిపారు. ఎస్కాఅహ్మద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది.
వెప్పమ్ దర్శకురాలితో రాహుల్
Published Sun, Nov 23 2014 2:21 AM
Related news
-
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
అమేథీ నుంచి రాహుల్.. రాయ్బరేలీ నుంచి ప్రియాంక? నామినేషన్లకు సన్నాహాలు?
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్గాల నుంచి మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 26న కేరళలోని వయనాడ్కు పోలింగ్ పూర్తయిన తర్వాత గాంధీ కుటుంబం అమేథీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నదని సమాచారం. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ వేయనున్నారని, దీనికి ముందు వారు అయోధ్యలో కొలువైన రామ్లల్లాను దర్శించుకోనున్నారని సమాచారం. వయనాడ్లో ఓటింగ్ ఏప్రిల్ 26న ముగియనుంది. అదే రోజున రాయ్బరేలీ, అమేథీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం అమేథీ, రాయ్బరేలీలలో పోటీ విషయమై ఏప్రిల్ 30లోపు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయనున్నదని సమాచారం. ఈ స్థానాల అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మౌనం వహిస్తూ వస్తోంది. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు.. అమేథీ, రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో మే ఒకటి నుంచి మూడవ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసే అవకాశముంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్లకు మే 3 చివరి రోజు. మే 20న ఐదవ విడతలో ఈ రెండు లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.రాహుల్, ప్రియాంకలు యూపీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ సెల్ ఇన్చార్జి జైరాం రమేష్తో పాటు పలువురు నేతలు గతంలోనే సూచన ప్రాయంగా తెలియజేశారు. తాజాగా అమేథీలోని రాహుల్ నివసించే బంగ్లాను శుభ్రం చేసి, పెయింటింగ్ వేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ నేపధ్యంలో రాహుల్ అమేథీ నుంచి, ప్రియాంక రాయ్బరేలీ నుంచి పోటీచేయవచ్చని స్పష్టమవుతోంది. -
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?
ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్పై రాశారు. రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. -
వింత రాజకీయం.. పొత్తు ఉన్నా ఎవరి ప్రచారం వారిదే?
పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్ఎల్డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్నగర్కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్పూర్ లోక్సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్పీ, బీఎస్పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు. -
అవినీతిపై ఉక్కుపాదమే: ప్రధాని మోదీ
రుద్రపూర్/జైపూర్: అవినీతిలో కూరుకుపోయిన కొందరు నాయకులు తనను బెదిరించేలా మాట్లాడుతున్నారని, నిస్సిగ్గుగా దూషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గి, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినీతిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అవినీతిపై ఇక ఉక్కుపాదమేనని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం గొంతు విప్పుతోందని అన్నారు. ప్రతి ఒక్క అవినీతిపరుడిపై చర్యలు ఉంటాయని, ఎవరినీ వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినవారు జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. తనను తిట్టొచ్చు, బెదిరించవచ్చు గానీ అవినీతిపై చర్యల విషయంలో మాత్రం ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశమంతటా మంటలు తప్పవంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ను దేశం నుంచి తుడిచిపెట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉత్తరాఖండ్లోని రుద్రపూర్లో తొలి బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి ఉద్దేశాలు బయటపడుతున్నాయని చెప్పారు. అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కాంగ్రెస్ రాజకుటుంబ వారసుడు దేశంలో మంటలు సృష్టించడం గురించి మాట్లాడుతున్నాడని, అలాంటివి మీరు అనుమతిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధమైన అనుచిత భాష మాట్లాడవచ్చా? వారిని మీరు శిక్షిస్తారా? లేదా? అని అడిగారు. బుజ్జగింపు రాజకీయాలే కాంగ్రెస్ నైజం ‘ఎమర్జెన్సీ’ ఆలోచనా ధోరణి ఉన్న కాంగ్రెస్కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. ఎన్నికల్లో రాబోయే ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టాలని కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. దేశాన్ని అస్థిరత, అరాచకం వైపు మళ్లించాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని ఆక్షేపించారు. ఆ పారీ్టకి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విడగొట్టాలన్న కాంగ్రెస్ నాయకుడిని శిక్షించాల్సింది పోయి లోక్సభ బరిలో దింపుతోందని ఆక్షేపించారు. ఆ అగ్నిని పదేళ్లుగా ఆర్పేస్తున్నా... విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘‘అవినీతిపై చర్యలను అడ్డుకోవడానికి అవినీతిపరులంతా చేతులు కలిపిన తొలి లోక్సభ ఎన్నికలివి. సొంత కుటుంబాలను కాపాడుకోవడానికి కుటుంబ పార్టీలు ర్యాలీల మీద ర్యాలీలు వరుసగా నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు కూడా ఇవే’’ అన్నారు. రాజస్తాన్లోని కోట్పుత్లీలో ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే దేశం అగి్నగుండం అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. అలాంటి అగ్నిని గత పదేళ్లుగా తాను ఆర్పేస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు.
Related News by category
-
యువకుడికి అరుదైన డీప్ బ్రెయిన్ శస్త్రచికిత్స
సాక్షి, చైన్నె: ప్రొగ్రసివ్ మయోక్లోనస్ ఎపిలెప్సీతో బాధ పడుతున్న 23 ఏళ్ల యువకుడికి అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్ర చికిత్సను గ్లెనెగల్స్ హెల్త్ సిటీ వైద్యులు విజయవంతం చేశారు. రెండు చిన్న రంధ్రాల ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చా రు. ఈ శస్త్ర చికిత్స గురించి సోమవారం గ్లెనెగల్స్ న్యూరాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎంటర్ ఫర్ ఎపిలెప్సీ డైరెక్టర్ డాక్టర్ దినేష్నాయక్ వివరించారు. పది సంవత్సరాల వయస్సు నుంచి నాగ్పూర్కు చెందిన యువకుడు(23) అరుదైన మూర్చ వ్యాధి లక్షణాలతో బాధ పడుతూ వచ్చాడని పేర్కొన్నారు. హఠాత్తుగా కింద పడి పోవడం, మాట రాక పోవడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు ఇతడిలో క్రమంగా పెరిగాయన్నారు. కొంతకాలం స్వస్థలంలోనే చికిత్స పొందినా, ఆకస్మాత్తుగా పరిస్థితి దయనీ యంగా మారడంతో హెల్త్ సిటీలో చేర్చినట్టు తెలిపారు. అన్ని రకాల పరిశోధనలతో అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్ర చికిత్స నిర్వహణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. న్యూ రో సర్జన్ హెడ్ డాక్టర్ నిగెల్ సిమ్స్, అనస్తీషియా డాక్టర్ రమణన్ తదితర వైద్య బృందం సహకారంతో 8 గంటలు శ్రమించి రెండు దశల్లో శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. మెదడులోని నిర్ధిష్ట కేంద్రంలోకి ఎలక్ట్రోడ్లను అమర్చినట్టు వివరించా రు. ప్రస్తుతం యువకుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు, తన రోజు వారి పనులన్నీ తానే చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో హెల్త్ సిటీ సీఈఓ డాక్టర్ నగేష్ కే రావు పాల్గొన్నారు. -
రథోత్సవం
వైభవంగా సాక్షి, చైన్నె: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారి వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరగ్గా, సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేకువ జామున ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అభిషేకాది పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను వేర్వేరుగా అలంకరించారు. సర్వాలంకారంతో ఉన్న స్వామి అమ్మవార్లు రథంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అతిపెద్ద రథంలో సుందరేశ్వర స్వామి, మరో రథంలో మీనాక్షి అమ్మవారి ఆశీనులయ్యారు. ఆలయం ఆవరణ నుంచి ఉదయం 7 గంటలకు రథాలు ఒకదాని తర్వాత మరొకటి భక్త జనుల శివనామస్మరణ మధ్య ముందుకు కదిలాయి. మీనాక్షి అమ్మవారి ఆలయ తక్కర్ రుక్మిణి పళణి వేల్, దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చెల్లదురై, ఆలయ జాయింట్ కమిషనరన్ కృష్ణన్ రథాలకు జెండా ఊపారు. కీల్ మాసివీధి, తెర్కు మాసి వీధి, మేల్ మాసి వీధి, వడక్కుమాసి వీధులలో 5 కి.మీ దూరం రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ రథాలకు ముందుగా గజరాజులు, ఎద్దులు కదిలాయి. శివాచార్యులు, శివ శక్తులు శంఖం పూరిస్తూ, డమరకం వాయిస్తూ శంభో శంకరా, నమశ్శివాయ నామస్మరణ మారుమోగింది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గజేంద్రుడు తదితర దేవుళ్ల ఉత్సవ విగ్రహాలను సప్పరాలలో ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అడుగడుగునా భక్తజనులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్త కోటి శివనామ స్మరణ నడుమ స్వామివారి రథం ముందుకు సాగగా, వెనుక అమ్మవారి రథం అనుకరించింది. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి రథోత్సవం పూర్తయ్యింది 12.10 గంటలకు అమ్మవారి రథం ఆలయం వద్దకు చేరుకున్నాయి. వేలాదిగా భక్త జనం తరలి రావడంతో మదురై జన సంద్రంలో మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం చేసింది. అలాగే భక్తుల సేవలో పలు సంఘాలు తరలించాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గించే విధంగా శీతల పానీయాల్ని అందజేశాయి. నేడు వైగై నదీ ప్రవేశం ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం మంగళవారం వైగై నదీ తీరంలో జరగనుంది. మదురైలో శైవం, వైష్ణవం సంబంధిత రెండు ఉత్సవాలు చిత్తిరై మాసంలో జరిపే విధంగా 400 ఏళ్ల క్రితం ఈ గడ్డను పాలించిన తిరుమలై నాయకర్ చర్యలు తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అంతకుమునుపు వేర్వేరుగా ఈ ఉత్సవాలు జరిగినా, తిరుమలై నాయర్ ఆదేశాలకు అనుగుణంగా శైవ,వైష్ణవ ఉత్సవాల మేళవింపుగా చిత్తిరై మాసంలో కనుల పండువగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రెండు ఉత్సవాల మేళవింపుగా మీనాక్షి అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు తేనూరు నుంచి కళ్లలగర్ స్వామివారు (విష్ణుమూర్తి) బయలుదేరి రావడం, వైగై నదీ ప్రవేశ ఘట్టం జరగడం ఈ ఉత్సవాలలో ప్రత్యేకత. ఈ వేడుకల నిమిత్తం తేనూర్ నుంచి ఆదివారం రాత్రంతా బంగారు పల్లకిలో ప్రయాణించిన కళ్లలగర్ సోమవారం సాయంత్రానికి మదురైకు చేరుకున్నారు. రాత్రంతా దారి పొడవున భక్త జనులు కర్పూర హారతులు పట్టారు. అలాగే ఆ మార్గంలోని పలు ఆలయాల వద్ద స్వామివారిని ఆహ్వానిస్తూ పూజాది కార్యక్రమాలు జరిగాయి. మూండ్రు మావడి వద్ద స్వామి వారికి ఎదుర్ సేవ అత్యంత వేడుకగా జరిగాయి. తల్లాకులం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న అళగర్ స్వామికి ప్రత్యేక తిరుమంజనం జరిగింది. ఇక్కడి నుంచి మంగళవారం ఉదయం జరిగే విశిష్ట పూజల అనంతరం శ్రీవిల్లి పుత్తూరు ఆండాల్ ఆలయం నుంచి వచ్చిన పూల మాలను ధరించి, బంగారు అశ్వరథంపై స్వామివారు వైగై నదీ ప్రవేశానికి వెళ్లనున్నారు. ఇందుకోసం ఆళ్వార్ పురం వైగై నదీ తీరంలో సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తారు దీంతో గట్టి భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఆధ్యాత్మిక నగరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా మదురై ఉత్సవాల వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం అనంతరం జరిగే ఎదుర్ సేవ సందర్భంలో వాహనంపై ఎలాంటి నీరూ చల్లకూడదనే ఆంక్షలను కోర్టు ఇప్పటికే విధించింది. దీనిని అమలు చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే వైగై నది ప్రవేశ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పనులను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది. రథోత్సవంలో పాల్గొన్న భక్తులుమదురై వీధులు భక్త జన సంద్రమయ్యాయి. సోమవారం అంగరంగ వైభవంగా మీనాక్షి సుందరేశ్వర స్వామి రథోత్సవం సాగింది. ఇక చిత్తిరై ఉత్సవాల్లో మరో ప్రధాన ఘట్టమైన కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం మంగళవారం ఆళ్వార్ పురంలో జరగనుంది. ఇందుకోసం తేనూరు నుంచి కళ్లలగర్ స్వామి(విష్ణుమూర్తి) మదురైకు చేరుకున్నారు. భక్తులను అనుగ్రహించిన మీనాక్షీ సుందరేశ్వర స్వామి జన సంద్రమైన ఆధ్యాత్మిక నగరం నేడు కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం ఏర్పాట్లు పూర్తి మదురైకు చేరుకున్న స్వామి వారు -
పరందూరుకు మెట్రో
● పూందమల్లి నుంచి విస్తరణ పనులు ● నివేదిక రెడీ ● 19 రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, చైన్నె : పూందమల్లి నుంచి పరందూరుకు మెట్రో రైలు పనులకు సంబంధించిన నివేదిక తాజాగా సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 10,712 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మొత్తం 43.66 కి.మీ దూరం ఏర్పాటు చేసే మెట్రో రైలు మార్గంలో 19 రైల్వే స్లేషన్లు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. వివరాలు.. చైన్నెలో ప్రస్తుతం ఫేజ్ –1 పనులు ముగియడంతో రెండు మార్గాలలో మెట్రో రైలు సేవలకు విపరీతమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఫేజ్– 2లో మరో మూడు మార్గాలలో పనులకు కార్యాచరణ సిద్ధం చేశారు. రూ. 63, 246 కోట్లతో 118.9 కి.మీ దూరం లైట్ హౌస్ – పూందమల్లి మధ్య 26.1 కి.మీ, మాధవరం – సిరుచ్చేరి సిప్కాట్ మధ్య 45.8 కి.మీ, మాధవరం నుంచి షోళింగనల్లూరు వరకు 47 కి.మీ దూరం మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గలలో అత్యధిక దూరం రైలు భూగర్భ మార్గంలోనే పయనించనుంది. ఈ పరిస్థితులలో పూందమల్లి వరకు ఉన్న మెట్రో సేవను పరందూరు వరకు విస్తరించేందుకు కార్యాచరణను రూపొందించారు. కొత్త విమానాశ్రయం వరకు .. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో పెరిగిన రద్దీతో మరో ఎయిర్పోర్టు నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం కాంచీపురం జిల్లా పరిధిలోని పరందూరును ఎంపిక చేశారు. చైన్నె నుంచి 60 కి.మీ దూరంలోని పరందూరులో 4,798 ఎకరాల స్థలంలో రూ. 40 వేల కోట్లతో పనులు చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఏకనాపురం వేదికగా 13 గ్రామాల ప్రజలు ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వీరంతా లోక్ సభ ఎన్నికలను సైతం బహిష్కరించారు. ఈ పరిస్థితులలో కొత్త విమానాశ్రయ టెర్మినల్ రూపుదిద్దుకునే పరందూరుకు మెట్రో రైలు సేవలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత టెండర్ల ప్రక్రి యపై దృష్టి పెట్టాలని మెట్రో వర్గాలు నిర్ణయించాయి. అంచనా వ్యయంగా రూ. 10,712 కోట్లు పూందమల్లి – పరందూరు మధ్య మెట్రో రైలు పనులకు రూ. 10,712 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 43.66 కి.మీ దూరం వంతెన మార్గంలో పనులు చేపట్టబోతున్నారు. ఈ మార్గంలో 19 రైల్వే స్టేషన్లు, మల్లీ లెవల్ పార్కింగ్ సెంటర్లు, మాల్స్ తదితర నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సమగ్ర నివేదికలో పొందు పరిచారు. చైన్నె నగరంలో సగటున కి.మీ లేదా 1.5 కి.మీ దూరానికి ఒక మెట్రో రైల్వే స్టేషన్ ఉన్నాయి. అయితే పూందమల్లి – పరందూరు మార్గంలో కొన్ని చోట్ల రెండు, మరికొన్ని చోట్ల మూడు కి.మీ దూరానికి ఓ రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది. రైలు అతి వేగంగా విమానాశ్రయం వైపుగా దూసుకెళ్లే విధంగా దూరాన్ని పెంచి రైల్వే స్టేషన్ల ఏర్పాటు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు పూందమల్లి, నషరత్ పేట చెక్ పోస్టు, చెంబరంబాక్కం, తిరుమలిసై టౌన్షిప్, పాపన్ చత్రం, చెట్టి పేడు, తండలం, ఇరుంగాట్టు కోట్టై, పొన్నలూరు, శ్రీపెరంబదూరు, పట్టునూల్ చత్రం, ఇరుంకులం పారిశ్రామిక వాడ, మాంబాక్కం, తిరుమంగళం, సుంకువారి చత్రం, సంత వేలూరు, పిల్లై చత్రం, నీర్వల్లూరు, పరందూరులలో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఈ నివేదికలో వివరాలను పొందు పరిచారు. -
గుకేశ్కు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, చైన్నె: భారత యువ చదరంగ క్రీడాకారుడు గుకేశ్ దొమ్మరాజు ప్రఖ్యాత ప్రపంచ చెస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో విజయం సాధించడంతో తమిళనాడులోని రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ పేర్కొంటూ, గతంలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సాధించిన ఘనతను ప్రస్తుతం అతి పిన్న వయసులో చరిత్ర సృష్టించే విధంగా టైటిల్ను గుకేశ్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో తనను గుకేశ్ కలిసిన సందర్భంగా తీసిన ఫొటోను తన సామాజిక మాధ్యమంలో సీఎం స్టాలిన్ షేర్ చేశారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొంటూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నా రు. గుకేశ్ టైటిల్ దక్కించుకోవడం దేశానికే కాదు తమిళనాడుకు గర్వకారణంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తదితరులు సైతం గుకేష్కు అభినందనలు తెలియజేశారు. విశ్వనాథన్ ఆనంద్ సైతం శుభాకాంక్షలు తెలుపుతూ అత్యంత పిన్న వయస్సులో ఈ టైటిల్ దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఇదిలా ఉండగా కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన గుకేష్ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబానికి చెందిన కుర్రోడు అనే విషయం తెలిసిందే. చైన్నెలో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదా వరి జిల్లాకు చెందిన తెలుగు కుటుంబం రజనీకాంత్, పద్మ దంపతుల కుమారుడు గుకేశ్. అతి చిన్న వయస్సులో భారత గ్రాండ్ మాస్టర్గా ప్రస్తుతం చరిత్ర సృష్టించిన గుకేశ్ చైన్నె శివారులోని అయనంబాక్కంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. రజనీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, పద్మ మైక్రోబయాలజిస్టుగా ఉన్నారు. చైన్నెకు టైటిల్తో రాబోతున్న గుకేశ్కు ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుకేశ్ -
సివిల్స్ టాపర్కు ఘన సత్కారం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఆవడి సరస్వతినగర్కు చెందిన భువనేష్రామ్ సివిల్స్లో 41వ ర్యాంకును సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో టాపర్గా నిలిచిన భువనేష్రామ్తో పాటు అతడి కుటుంబ సభ్యులను కలెక్టర్ సోమవారం ఉదయం తన కార్యాలయానికి పిలిపించి సత్కరించారు. 27 ఏళ్ల వయస్సులో ఐఏఎస్కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భువనేష్రామ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు. దీంతో పాటు పోటీ పరీక్షలకు ఎంపికవుతున్న విద్యార్థులతో భువనేష్రామ్ ముఖాముఖి నిర్వహించి వారిని ప్రోత్సహించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగాలని యువతకు సూచించిన ఆయన, ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పం ఉండాలని సూచించారు. డీఆర్వో రాజ్కుమార్, భువనేష్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల స్వీకరణ కొరుక్కుపేట: విద్యా హక్కు (ఆర్టీఈ) చట్టం కింద తమిళనాడు రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో (మైనారిటీ స్కూల్స్ మినహా) 2024–25 విద్యా సంవత్సరానికి ఎల్కేజీ, 1వ తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం ఆన్లైన్లో ప్రారంభమైంది. మే 20లోగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రైవేట్ పాఠశాలల డైరెక్టర్ తెలిపారు. ఇతర వివరాలకు www.rte.tnshools.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. మే 26న లాటరీ ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు. ఆ నగదు మనీలాండరింగ్ పరిధిలోకి రాదు! ● కోర్టుకు ఈడీ వివరణ సాక్షి, చైన్నె: ఎన్నికల సమయంలో పట్టుబడే నగదు మనీ లాండరింగ్ కేసు పరిధిలోకి రాదుని మద్రాసు హైకోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని కోర్టు సమగ్ర వివరాలను సమర్పించాలని ఆదేశించింది. వివరాలు..ఎన్నికల తనిఖీలలో భాగంగా తిరునల్వేలికి రైలులో తరలిస్తున్న రూ. 4 కోట్ల నగదును తాంబరంలో అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఈ నగదు తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్కు చెందినట్టు తేలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్వతంత్ర అభ్యర్థి రాఘవన్ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. ఎలాంటి సమాధానం రాక పోవడంతో హైకోర్టు తలుపు తట్టారు. ఈ వ్యవహారంపై సోమవారం ఈడీ అధికారులు కోర్టుకు వివరణ ఇచ్చారు. పట్టుబడ్డ ఈ నగదు మనీ లాండరింగ్ కేసు పరిధిలోకి రాదు అని వివరణ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఈ నగదు పట్టుబడిన దృష్ట్యా, ఆదాయ పన్నుశాఖ, పోలీసుల విచారణ పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు సమగ్ర వివరాలను ఈనెల24వ తేదీన సమర్పించాలని ఆదేశించారు. అదే సమయంలో ఈ నగదు విషయంగా విచారణకు రావాలని నయనార్ నాగేంద్రన్కు ఇప్పటికే తాంబరం పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన లాయర్ల ద్వారా హాజరు కాకపోవడానికి గల కారణాలు, తనకు మరో పది రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ తాంబరం పోలీసులకు నయనార్నాగేంద్రన్ సమాచారం పంపించడం గమనార్హం. తిరుత్తణి బస్టాండులో ఆక్రమణల తొలగింపు తిరుత్తణి: తిరుత్తణి బస్టాండ్లో ఆక్రమణలు పెరగడంతో ప్రయాణికులు ఎండలో ఇబ్బంది పడేవారు. పైగా ప్రయాణికుల పట్ల వ్యాపారులు దురుసుగా వ్యవహరించడంతో మున్సిపల్ కమిషనర్ అరుల్ సోమవారం తన సిబ్బందితో వెళ్లి పండ్లు, బొమ్మలు, పువ్వుల దుకాణాలు తొలగించారు. దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. చిదంబరం నటరాజ స్వామి ఆలయ గుర్రం మృతి తిరువొత్తియూరు: చిదంబరం నటరాజ ఆలయంలో అశ్వపూజ కోసం ఒక గుర్రాన్ని రాజా అనే పేరుతో సంరక్షిస్తున్నారు. ఇటీవల రాజా అస్వస్థతకు గురికావడంతో గత 4 రోజులుగా పశువైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆదివారం చికిత్స పొందుతూ రాజా మృతి చెందింది. గత 4 సంవత్సరాలుగా తిల్లై నటరాజ సేవలో నిమగ్నమై ఉన్న అశ్వరాజు ఆత్మకు శాంతి కలగాలని భక్తులు, దీక్షితులు పూలమాలలు వేసి నివాళులర్పించి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నేనే కోచ్ అయివుంటే.. అతడికి జట్టులో నో ఛాన్స్: సెహ్వాగ్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement