సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 14 నుంచి రాజధానిలో రెండువారాల పాటు జరిగే అంతర్జాతీయ వాణిజ్య మేళా కోసం ప్రగతిమైదాన్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఇతివృత్తంగా జరిగే ఈ మేళాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నవంబర్ 14న ప్రారంభిస్తారు. 34వ వాణిజ్య మేళాలో దక్షిణాఫ్రికా భాగస్వామ్యదేశంగా, థాయ్లాండ ఫోకస్ దేశంగా, ఢిల్లీ ఫోకస్ రాష్ట్రంగా పాల్గోనున్నాయి.
మేళాలో మొదటి ఐదు రోజులను అంటే 14 నుంచి 18 తేదీవరకు వాణిజ్య సందర్శకుల కోసం కేటాయించారు. నవంబర్ 19 నుంచి సామాన్య ప్రజల కోసం మేళా తలుపులు తెరచుకుంటాయి. వాణిజ్య సందర్శకులను మాత్రమే అనుమతించే రోజులలో టికెట్ వెల 400 రూపాయలు ఉండనుంది. నవంబర్ 19 నుంచి మాత్రం రూ.50 టికెట్ కింద వసూలు చేస్తారు. వారాంత పు సెలవు దినాలు, ప్రభుత్వ సెలవు రోజులలో టికెట్ వెల రూ.80గా ఉండనుంది.
మేళాలో పాకిస్థాన్ సందడి:
దాదాపు 25 దేశాలు ఈ మేళాలో పాల్గోనున్నాయి. ఇటీవలి కాలంలో భారత్ - పాకిస్థాన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ పాకిస్థాన్ వ్యాపారులు మాత్రం రాజధానిలో జరిగే వాణిజ్య మేళాలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. పాకిస్థాన్కు చెందిన 115 కంపెనీలు మేళాలో పాల్గొంటున్నాయి. గత సంవత్సరం 85 కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. ఈ సంవత్సరం పాకిస్థాన్కు రెండుహాళ్లలో స్థలం కేటాయించనున్నారు. హాల్ నంబర్ 6, హాల్ నంబర్ 20లలో పాకిస్థాన్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసుకోనున్నాయి. పాకిస్థాన్ ఉత్పత్తులలో ఓనిక్స్ స్టోన్, సిల్క్, ఉత్పత్తులు, దుస్తులు, మసాలాలకు అధిక డిమాండ్ ఉంటుంది.
ప్రతి సంవత్సరం వాణిజ్య మేళాలో భారీ స్థాయిలో స్టాల్స్ ఏర్పాటుచేసే చైనా ఈసారి మేళా పట్ల అంత ఉత్సాహం చూపడం లేదు. మేళాలో పాల్గొనే కంపెనీల సంఖ్యను బట్టి చూస్తే పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, కొరియా, అఫ్గానిస్తాన్ తరువాతి స్థానాలలో ఉన్నాయి. అంటే చైనా మొదటి ఐదు దేశాలలో కూడా లేదు. చైనా ఈసారి ఏడవ స్థానంలో ఉందని మేళా నిర్వహించే ఐఐటీఎఫ్ అధికారులు చెబుతున్నారు.
14 నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా
Published Fri, Nov 7 2014 11:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement