న్యూఢిల్లీ: నిరాహార దీక్ష వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదని మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అందువల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తమ డిమాండ్ల సాధనకోసం జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష నిర్వహిస్తున్న ఆల్ గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులను శనివారం పరామర్శించిన అరవింద్... తన అనుభవాన్ని వారికి పూసగుచ్చినట్టు వివరించారు. అందువల్ల వెంటనే దీక్షను విరమించాలని వారిని కేజ్రీవాల్ కోరారు. కాగా మా ధర్నాలో మీరు కూడా పాల్గొంటారా అంటూ ఉపాధ్యాయులు ప్రశ్నించగా అందుకు తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని, అయితే దాని వల్ల ఫలితం కూడా లేదని తెలిపారు. ‘నిరాహార దీక్ష వల్ల మీకు ఎటువంటి ఉపయోగమూ లేదు. పైగా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
నేను కూడా గతంలో 15 రోజులపాటు నిరాహార దీక్ష చేశా. ఆ తర్వాతనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా’నని ఆయన వివరించారు. బీజేపీ ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి ఉపశమనమూ లభించదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీనిగానీ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్నుగానీ కలవండంటూ హితబోధ చేశారు. ఇందువల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందన్నారు. ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయని, అందువల్ల రాజకీయ నాయకులు మిమ్మల్ని కలిసేందుకు రావడమే కాకుండా, హామీలిస్తారని, అయితే అందువల్ల ప్రయోజనమేమీ ఉండబోదన్నారు. వాళ్లు ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడానికే పరిమితమవుతారన్నారు.
ఇప్పటికీ తాను అధికారంలో ఉండిఉంటే కనుక మీ సమస్యను పరిష్కరించేవాడినన్నారు. ఇదిలాఉండగా ఆందోళనలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో కేజ్రీవాల్ వారిని సమీపంలోని రామ్మనోహర్లోహియా ఆస్పత్రికి తరలించారు. వారిరువురు చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఉపాధ్యాయులంతా గత మూడు వారాలుగా ధర్నా నిర్వహిస్తున్న సంగతి విదితమే. తమ సేవలను పునరుద్ధరించాలంటూ పదివేలమందికిపై ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. తమకు విధించిన వయోపరిమితిని పెంచాలనేది వారి డిమాండ్లలో ఒకటి. కాగా సీఎం కాకముందు అరవింద్ కేజ్రీవాల్ అనేక ధర్నాలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే ఆయన రాజకీయ పార్టీ స్థాపించడానికి మూలమైంది.
ధర్నాలు, ఆందోళనల వల్ల ఏమీ ప్రయోజనం లేదు
Published Sat, Jul 12 2014 10:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement