కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, బెంగళూరు : రానున్న ఏడాది సెప్టెంబర్ 15 లోపు నమ్మ మెట్రో ఫేజ్ 1 పనులు పూర్తి అవుతాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. 42.3 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణం కోసం మొత్తం రూ. 11,609 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. రాష్ర్ట రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి విధానసౌధ, హైకోర్టు మధ్య జరుగుతున్న మెట్రో పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు.
అనంతరం కుమార కృప గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికే ఫేజ్ 1 పనులు పూర్తి కావాల్సి ఉందని, అయితే సొరంగ మార్గాల తవ్వకంలో ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోదని వివరించారు.72.05 కిలోమీటర్ల పొడవైన మెట్రో పేజ్ 2 పనులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం నుంచి అనుమతి లభించిందని గుర్తు చేశారు. పనులు ప్రారంభించిన ఐదేళ్లలోపు పూర్తి అవుతుందని తెలిపారు.
ఇందుకు మొత్తం రూ. 26,105 కోట్లు అవసరమవుతాయని అన్నారు. రాష్ర్టంలోని అన్ని అభివృద్ధి పనులకు స్థానిక ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకూ తావుండదని స్పష్టంచేశారు. ఎలక్ట్రానిక్ సిటీ వరకూ మెట్రో విస్తరణ వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని భేటీ అయ్యేందుకు ఆయన వెళ్లారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... మెట్రో ఫేజ్ 2 పనులకు అవసరమైన నిధుల కోసం పన్ను రహిత బాండ్లను వితరణ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరనున్నట్లు చెప్పారు. ఈ విషయంగా తన వంతు సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారని తెలిపారు.
మరో ఏడాదిలో మెట్రో ఫేజ్1 పూర్తి
Published Sat, Jun 21 2014 2:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
రూరల్ యాక్షన్కి సై
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement