సాక్షి, ముంబై: మోనో రైలు మార్గం ప్రారంభమైతే ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదట మోనోరైలులో కొన్ని రోజుల పాటు రైల్వే సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. వారు మామూలు ప్రయాణికుల మాదిరి స్టేషన్కు వస్తారు... భద్రతాపరమైన తనిఖీలు పూర్తిచేసుకుని ముందుకు వెళతారు... టికెట్లు తీసుకొని ప్లాట్ఫారంపైకి వెళతారు... రైలు రాగానే ఎక్కి తమకు ఇష్టమున్నచోట దిగుతారు... అక్కడ అందుబాటులో ఉన్న ఎస్కలేటర్ను వినియోగించి స్టేషన్ నుంచి బయటపడతారు. చెంబూర్-వడాల (9.8 కి.మీ.) మోనోరైలు మార్గంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ దృశ్యం దర్శనమివ్వనుంది. మోనోైరె ళ్లు ప్రారంభమైన తర్వాత నిజంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడతారు.. వాటిని వీరు స్వయంగా ప్రయాణించి అనుభవించి చూస్తారు. అనంతరం పరిష్కరించేందుకు కృషి చేస్తారు.
అంతా సవ్యంగా జరిగితే అప్పడు ముంబైకర్ల కోసం ప్రారంభిస్తారు. ప్రస్తుతం మోనోరైళ్లకు అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. భద్రతాపరమైన (సేఫ్టీ సర్టిఫికెట్) పత్రం లభించేంతవరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలులేదు. దీంతో మోనోరైళ్లలో అమర్చిన వివిధ విద్యుత్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి..? ఆటోమేటిక్ డోర్ల పనితీరు, అత్యవసర సమయంలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు ఎలా పంపించాలి..? తదితరాలపై సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ‘కమర్షియల్ ఆఫ్ ట్రయల్’ జరగనుంది. మోనోకు చెందిన ఎనిమిది స్టేషన్ల మీదుగా సంబంధిత రైల్వే సిబ్బంది, అధికారులు ఒక సాధారణ ప్రయాణికులుగా రాకపోకలు సాగించనున్నారు. ప్రయాణికుల దృష్ట్యా ఈ సదుపాయాలు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఈ అధికారులు పరిశీలిస్తారని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రతినిధి దిలీప్ కవట్కర్ చెప్పారు.
‘మోనోరైళ్లు ప్రారంభమైన తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కుతారు.. దిగిపోతారు.. కాని హడావుడిలో సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోరు. దీంతో ప్రారంభానికి ముందే రైల్వే అధికారులు, సిబ్బంది స్వయంగా సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించి ఆ తర్వాత ముహూర్తం ఖరారుచేసి ప్రజలకు అనుమతి కల్పిస్తార’ని కవట్కర్ అభిప్రాయపడ్డారు.
‘మోనో’కు మరిన్ని పరీక్షలు!
Published Wed, Aug 21 2013 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement