సాక్షి, ముంబై: టోల్నాకా సిబ్బందిపై దాడికి పాల్పడినందుకు స్వాభిమాన్ సంఘటన్ సంస్థ అధ్యక్షుడు నితేశ్ రాణే సహా పదిమందిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి పొద్దుపోయాక పోలీసులు వీరిని ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా నితేశ్ తోపాటు మరో నలుగురిని బెయిల్పై విడుదల చేసింది. నితేశ్ని అరెస్టు చేసినట్లు తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ముందు జాగ్రత్తచర్యగా పోలీసు బలగాలను మోహరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సింధుదుర్గ్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ముంబై-గోవా జాతీయ రహదారిపై ధార్గల్-పేడ్నే టోల్ నాకా ఉంది. ఆరు నెలల క్రితం నుంచి గోవాకి వెళ్లే పర్యాటకుల వద్ద నుంచి అక్కడ ప్రవేశ రుసుంవసూలు చేస్తున్నారు. అయితే సింధుదుర్గ్ జిల్లా వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.
మంగళవారం సాయంత్రం నితేశ్ రాణే, మరికొందరు ఈ టోల్నాకా మీదుగా వాహనంలో వెళుతుండగా ఆపిన అక్కడి సిబ్బంది ప్రవేశ రుసుము చెల్లించాలని అడిగారు. ఇందుకు నితేశ్ స్పందిస్తూ తాను సింధుదుర్గ్ ప్రాంతవాసినేనని, అందువల్ల డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అయితే రాణే వాహన సంఖ్య సింధుదుర్గ్ జిల్లాకు చెందినది కాకపోవడంతో డబ్బులు చెల్లించాల్సిందేనంటూ టోల్నాకా సిబ్బంది పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సిబ్బంది, రాణే మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన రాణే మద్దతుదారులు టోల్నాకా కార్యాలయం అద్దాలను పగుల గొట్టారు. అంతటితో ఊరుకోకుండా సిబ్బందిపై చేయిచేసుకున్నారు.
ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పేడ్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాణేతోపాటు తొమ్మిది మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ సమీపంలోని అంజునా కారాగారానికి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. ఈ విషయం తెలుసుకున్న నితేశ్ సోదరుడు, ఎంపీ నీలేశ్ రాణే తన మద్దతుదారులతో అక్కడి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సోదరుడి తరఫున బహిరంగ క్షమాణలు కోరుతున్నానన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానన్నారు. సింధుదుర్గ్ జిల్లా పరిధిలోని పేడ్నే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
నితేశ్ రాణే అరెస్టు
Published Thu, Dec 5 2013 6:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement