సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలో మూడోవంతు పోస్టులను మహిళలకు కేటాయించనున్న ట్లు హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఢిల్లీ పోలీసుల్లో మహిళా బలగాన్ని 1/3 వంతుకు పెంచాలని తాము నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర పోలీస్తో పాటు కేంద్ర పోలీస్ బల గంలో మహిళల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన తెలిపారు. కేటాయించిన బలగం ప్రకారం ఢిల్లీలో ప్రతి లక్ష మంది జనాభాకు 420.49 పోలీసులు ఉండవలసి ఉండగా 391.33 మంది (2013 జనవరి లెక్కల ప్రకారం) పోలీసులు ఉన్నారని ఆయన చెప్పారు. అఖిల భారత స్థాయిలో ప్రతి లక్ష జనాభాకు 181. 47 మంది పోలీసులను కేటాయించగా వాస్తవంగా వారి సంఖ్య 136.42గా ఉందని ఆయన వివరించారు.
రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలతో పాటు ఇతర పోలీసు సంస్థలు సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. ఐపీఎస్ అధికారుల కొరత ఉందని ఆయన సభకు తెలిపా రు. ఐపీఎస్ అధికారుల కొరతను తీర్చడం కోసం సివిల్ సర్వీస్ పరీక్షలో ఐపీఎస్ బ్యాచ్ పరిమాణాన్ని పెంచినట్లు ఆయన చెప్పారు. ప్రతి సంవత్స రం 80 మంది ఐపీఎస్ అధికారులను లిమిటెడ్ కాం పిటీటివ్ పరీక్ష ద్వారా ఎంపిక చేసి భర్తీచేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే కోర్టు కేసుల కారణంగా ఈ పద్ధతిలో నియామకాలు జరపడం ప్రారంభించలేదని ఆయన చెప్పారు. పదోన్నతుల ద్వారా ఐపీఎస్ అధికారులను నియమించే ప్రక్రియను వేగిరపరచినట్లు ఆయన చెప్పారు.
ఢిల్లీ పోలీసుల్లో మూడోవంతు మహిళలు
Published Thu, Aug 7 2014 12:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
Advertisement