తెలుగు రాష్ట్రాలకు మోదీ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు మోదీ శుభాకాంక్షలు

Published Fri, Jun 3 2016 3:22 AM

తెలుగు రాష్ట్రాలకు మోదీ శుభాకాంక్షలు - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. రానున్న సంవత్సరాల్లో అభివృద్ధి సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను..’ అని పేర్కొన్నారు. ‘అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్రాభివృద్ధి ఇలాగే కొనసాగుతూ శరవేగంగా దూసుకెళ్లాలని కోరుకుంటున్నా’అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement