బళ్లారి అర్బన్/చిత్రదుర్గం, న్యూస్లైన్ : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలు బుధవారం బళ్లారి నగరంలో ఘనంగా జరిగాయి. పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన చెల్లెళ్లు అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఈ బంధం జన్మజన్మలు కొనసాగాలని ఆశీర్వాదం పొందారు. నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీలు విద్యార్థులకు రాఖీలు కట్టి తిలకం దిద్ది మిఠాయిలను ఇచ్చి రాఖీ వేడుకలను జరుపుకున్నారు.
మరికొందరు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు చీరలు ఇచ్చి ఒడి బియ్యం పోసి సంతోషంగా ఉండాలని దీవించారు. చిన్నారులు కూడా ఒక రికొక్కరు రాఖీని కట్టుకొని తమ అనుబంధాన్ని చాటారు. నగరంలో సంతోషిమాత ఆలయంలో, కోట ప్రాంతంలోనిసంతోషిమాత ఆలయంలో రాఖీపౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ పూజలు చేశారు. పంచామృతాభిషేకం, కుంకుమ అర్చన, మహామంగళ హారతి, అన్నదానం నిర్వహించారు.
సాయంత్రం 108 హారతులు వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం ఊయల సేవ, రథోత్సవం, భజన, సంగీత కార్యక్రమం తదితర పూజలను నిర్వహించారు. చిత్రదుర్గం నగరంలో పార్శనాథ పాఠశాలలో విద్యార్థులు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని సోదర భావాన్ని పెంపొందించుకునే విధంగా అధ్యాపకులు ప్రోత్సహించారు.
ఘనంగా రాఖీ పౌర్ణమి
Published Thu, Aug 22 2013 3:26 AM
Advertisement
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
What’s your opinion
Advertisement