చెన్నై, సాక్షి ప్రతినిధి : తంజావూరు జిల్లా కుంభకోణం కాశీరామన్ వీధిలో శ్రీకృష్ణ ఆధ్యాత్మిక సంస్థ సాయంతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాల, సరస్వతీ పాఠశాల, శ్రీకృష్ణ మహిళా ఉన్నత పాఠశాల, ఈ మూడూ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. 2004 జూలై 16న ఉదయం పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించగా 94 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యూరు. పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి, రిజిస్ట్రార్ సరస్వతి, ప్రధానోపాధ్యాయురాలు శాంతలక్ష్మి తదితరులతోపాటూ విద్యాశాఖకు చెందిన అధికారులు మొత్తం 24 మందిపై కుంభకోణం పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినపుడు అందరినీ అరెస్ట్ చేయగా తరువాత బెయిల్పై వచ్చారు.
ఈ కేసుకు సంబంధించి 2005లో కుంభకోణం కోర్టులో చార్జిషీటు దాఖలైంది. నిందితులకు 2006లో చార్జిషీటు ప్రతులను అందజేశారు. నిందితుల్లో పాఠశాల కరస్పాండెంట్ పళనిస్వామి అల్లుడు, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు ప్రభాకరన్ అప్రూవర్లుగా మారారు. విద్యాశాఖ డెరైక్టర్ కన్నన్, సీఈవో ముత్తుపళనిస్వామి, తహశీల్దారు పరమశివంను హైకోర్టు విడిచిపెట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు 512 మంది సాక్షులను విచారించారు. ఈ నెల 31వ తేదీలోగా కేసు విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలని ఈ ఏడాది మే 5న సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఆ ఆదేశాలను అనుసరించి ఈనెల 30వ తేదీన (నేడు) తీర్పును వెల్లడిస్తున్నట్లు తంజావూరు జిల్లా మొదటి శ్రేణి మేజిస్ట్రేటు మహ్మమద్ ఆలీ ప్రకటించారు. తుది తీర్పు వెలువడనున్న దృష్ట్యా చార్జిషీటులోని 21 మంది బుధవారం కోర్టుకు హాజరుకానున్నారు. రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో కోర్టు పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
‘కుంభకోణ’ దారుణంపై నేడే తీర్పు
Published Tue, Jul 29 2014 11:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement