చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై నగరంలో జరుగుతున్న మెట్రోరైలు నిర్మాణ పనులు మరో నిండు ప్రాణాన్ని తీసుకున్నాయి. పరంగిమలై వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో గిరిధర్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు దుర్మరణం చెందాడు.ఉదయం 9.30 గంటల సమయం. ఆఫీసులు, వ్యాపారాలకు, విద్యాలయాలకు వెళ్లే వారితో నగరమంతా వందలాది వాహనాలతో రద్దీమయం. అందరితోపాటూ గిరిధర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆఫీసుకని మడిపాక్కంలోని తన నివాసం నుండి బయలుదేరాడు. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ తలకు హెల్మెట్ కూడా ధరించి ద్విచక్రవాహనంపై వడపళనిలోని ఆఫీసువైపుగా ప్రయాణం. ఏడాదిన్నర క్రితమే పెళ్లి, నిండుగర్భిణిగా పుట్టింటికి వెళ్లిన భార్య, త్వరలో తండ్రి కాబోతున్న సంతోషంతో సాగిపోతున్నాడు. మరికొద్ది క్షణాల్లో మృత్యువు తనను కబళిస్తుందని తెలియదు పాపం. కత్తిపార జంక్షన్ మీదుగా పరంగిమలై వద్ద బైక్పై ప్రయాణిస్తున్న తరుణంలో మెట్రో పనుల కోసం అమర్చిన పది అడుగుల పొడవున్న ఒక బలమైన ఇనుప చట్రం అతని తలపై పడింది.
సుమారు వంద అడుగుల ఎత్తునుండి పడటంతో హెల్మెట్ను చీల్చివేసి అతని తలను ఛిద్రం చేసింది. తీవ్ర రక్తస్రావంతో గిలగిల కొట్టుకుంటూ గిరిధర్ అక్కడే ప్రాణాలు విడిచాడు. అతని వాహనంతోపాటూ ప్రయాణిస్తున్న వారు ప్రమాదాన్ని కళ్లారా చూసి భయంతో వణికిపోయారు. మరిన్ని ఇనుప కమ్మీలు పడుతాయనే భీతితో పాదాచారులు పరుగులు పెట్టారు. అంబులెన్స్ పిలిచే సమయం కూడా లేకుండా గిరిధర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం కారణంగా సుమారు గంట పాటూ ట్రాఫిక్ స్థంభించి పోయింది. ఆగ్రహించిన ప్రజానీకం మెట్రో పనులను పర్యవేక్షిస్తున్న అరవింద్,రాజాలపై దాడికి దిగింది. కుమారుని మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు సీత, లక్ష్మణ్లు ప్రమాదస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరైనారు. గిరిధ ర్, ఉత్తరలకు ఏడాదిన్నర క్రితమే వివాహం అయిం ది. భార్య ఉత్తర సైతం సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
గర్బిణీగా ఉన్న భార్య కాన్పుకోసం పుట్టిం టికి వెళ్లి ఉంది. ఈ తరుణంలో కుమారుడు మృత్యువాతపడటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయా రు. కుమారుని మరణవార్త కోడలికి ఎలాచెప్పాలని గిరిధర్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.చెన్నై నగరంలో పలుప్రాంతాల్లో సాగుతున్న మెట్రో పనులు ప్రాణాలను బలిగొనడం సహజంగా మారిపోయింది. మూడేళ్ల క్రితం వడపళనిలో మెట్రోరైలు బ్రిడ్జి నిర్మాణానికి అమర్చిన ఒక ఇనుప క మ్మి పై నుండి రోడ్డుపై పడింది. నిత్యం రద్దీగా ఉండే ఆ సమయంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. మెట్రోపనుల్లో ఇది మొదటి ప్రమాదం. కాగా, కీల్పాక్ వద్ద పనుల్లో ఒక జేసీబీకి అమర్చిన ఇనుపరాట్నం ఊడిపడగా అక్కడ పనిచేస్తున్న బీహార్కు చెందిన కూలీ కార్మికుడు మృతి చెందాడు. భార్య, పిల్లలను రైల్వేస్టేషన్లో దింపి ఇంటికి వెళుతుండగా అన్నాశాలై వద్ద మెట్రోపనుల నుంచి పడిన ఇనుపరాడ్ అతన్ని బలిగొంది. సైదాపేట, ఆలందూరు వద్ద మరో ఇద్దరు మృతి చెందారు. ఇటీవల ట్రిప్లికేన్లో మెట్రో సొరంగం పనుల వల్ల ఆరు ఇళ్లు రెండు అడుగుల మేర భూమిలో దిగబడిపోయాయి.
ప్రాణం తీసిన మెట్రో
Published Thu, Jun 18 2015 4:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement