సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల రెండో తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ భారత్ అభియాన్ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు విధిగా హాజరుకావాలని విద్యాశాఖ డెరైక్టరేట్ ఆదేశించింది. గాంధీ జయంతి నాడు విద్యార్థులు, సిబ్బంది పాఠశాలలకు విధిగా హాజరుకావాలని, వారు స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేసి, పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఇంటికి వెళ్లిపోవచ్చని పేర్కొంది. సింగిల్ షిఫ్టులో పనిచేసే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతోపాటు సిబ్బంది ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు, రెండో షిఫ్టులో పనిచేసే పాఠశాలల విద్యార్థులు , సిబ్బంది మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విద్యాశాఖ తన సర్య్కులర్ పేర్కొంది. అరగంటసేపు అసెంబ్లీ జరిపి విద్యార్థులకు పరిశుభ్రత ప్రాధాన్యాన్ని బోధించాలని ఆ తరవాత వారితో స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేయించాలని పేర్కొంది.
ఆతరువాత వారికి మధ్యాహ్న భోజనం వడ్డించి ఇంటికి పంపించాలని పేర్కొంది. ఆ తరువాత కూడా విద్యార్థులకు ప్రతిరోజూ అసెంబ్లీలో పరిశుభ్రతపై అవగాహరన కల్పించాలని, స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేయించాలని, విద్యార్థుల పుట్టిన రోజున వారితో మొక్కలు నాటించాలని కూడా విద్యాశాఖ డైరక్టరేట్ పాఠశాలలకు సూచించింది. స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం తాము జారీ చేసిన ఆదేశాల ఏవిధంగా అమలు చేస్తున్నారనే విషయం తెలుసుకోవడం కోసం విద్యాశాఖ అధికారులతో పాటు ఇతర అధికారులు ఆయా పాఠశాలలను సందర్శిస్తారు. ఇదిలాఉంచితే స్వచ్ ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇండియా గేట్ వద్ద నిర్వహించే నడక కార్యక్రమంలో 2,500 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. వారితో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రెండున స్వచ్ఛ్ భారత్ అభియాన్
Published Mon, Sep 29 2014 10:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement