సాక్షి, న్యూఢిల్లీ: తాజా ఎన్నికలతో రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా రాకతో పత్పర్గంజ్ ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొన్నా ఈసారి ఇక్కడ ముక్కోణపు పోటీ తప్పదంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన చౌదరీ అనిల్ కుమార్, బీజేపీకి చెందిన నకుల్ భరద్వాజ్ను ఆరువందల ఓట్లతో ఓడించారు. అనిల్కుమార్ ప్రస్తుత విధానసభలో అతి పిన్న వయస్కులైన సభ్యులలో ఒకరు. ఈసారి కూడా కాంగ్రెస్ మళ్లీ అనిల్ కుమార్కే టికెట్ ఇచ్చింది. బీజేపీ కూడా నకుల్ భరద్వాజ్నే బరిలోకి దింపింది. ఈ ఇరువురు యువనేతలు ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం రాజకీయాల్లోనూ ప్రత్యర్థులే. వారి మధ్యనున్న రాజకీయ వైరం 2008 ఎన్నికల్లోనూ కనిపించింది. అయితే ఏఏపీ తరఫున రంగంలోకి దిగిన మనీశ్ సిసోడియాతో ఓట్లు చీలే అవకాశముందంటున్నారు.
మనీష్ సిసోడియా ఆమ్ఆద్మీ పార్టీ నేతలలో ప్రముఖుడు. ఈ నియోజకవర్గ ఓటర్లపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కూడా అధికంగా ఉందని రాజ కీయ పండితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్పర్గంజ్ ఎన్నికల పోరు ఆసక్తికరం గా మారింది. మొత్తం 11 మంది అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
లక్షా అరవై వేల మంది ఓటర్లున్న ఈ నియోజవర్గంలో ప్రధాన సమస్యలను చెప్పమంటే ముందుగా నీటి నాణ్యత, సీవేజ్, గార్బేజ్ సమస్యలనే చెబుతారు. వినోద్ నగర్, మండావలి, మయూర్ విహార్ ఫేజ్-2, పత్పర్గంజ్ వార్డులు ఈ నియోజకవర్గం పరిధి కిందకు వస్తా యి. ఇక్కడి ఓటర్లను మూడు విభాగాలుగా విభజించవచ్చు.
మొదటి విభాగంలో హౌజింగ్ సొసైటీలు, డీడీఏ ఫ్లాట్లలో నివసించే విద్యావంతులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగులు కాగా రెండవ విభాగంలో వ్యాపారులు, ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చి చిన్నాచితకా ఉద్యోగాలతో, వ్యాపారాలతో పొట్టపోసుకునేవారు. ఇక మురికివాడలు, పునరావాస కాలనీలలో నివసించే రోజుకూలీలు, ఆటోడ్రైవర్లు, ఇళ్లలో పనులు చేసేవారు మూడో విభాగం కిందకు వస్తారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో అందరిదీ కిలకపాత్రే అని చెప్పవచ్చు.
మనీశ్తో మారిన సమీకరణాలు
Published Fri, Nov 22 2013 11:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు
అందుకే రాహుల్ను సెలక్ట్ చేయలేదు.. పంత్, సంజూకు: అగార్కర్
అప్పుడు అజిత్ లేడు.. అందుకే విరామం: రోహిత్ క్లారిటీ
కన్నబిడ్డపై తండ్రి కర్కశం, ప్రాణం పోయే దాకా : తల్లడిల్లిన తల్లి
అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!
ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
తప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
Advertisement