సాక్షి, న్యూఢిల్లీ : ఆపిల్ ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు పోటాపోటీగా.. వీటి విడుదల రోజే స్మార్ట్ఫోన్ల దిగ్గజం శాంసంగ్, గెలాక్సీ నోట్8ను భారత్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫాబ్లెట్ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా అమెజాన్లో ప్రీ-ఆర్డర్కు వచ్చింది. సెప్టెంబర్ 21 వరకు ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ చేపడుతోంది. సెప్టెంబర్ 21 నుంచే శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వినియోగదారుల చేతుల్లోకి కూడా వచ్చేస్తోంది. ప్రీ-ఆర్డర్ల సందర్భంగా గెలాక్సీ నోట్ 8పై అమెజాన్ బంపర్ ఆఫర్లను వినియోగదారులకు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులపై 4000 రూపాయల క్యాష్బ్యాక్, ఉచితంగా వైర్లెస్ ఛార్జర్, 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, 448జీబీ రిలయన్స్ జియో డేటాను అమెజాన్ ఆఫర్ చేయనుంది. నోట్ 8 ప్రీ-ఆర్డర్పై ఒక్కసారి స్క్రీన్ రీప్లేస్మెంట్ గ్యారెంటీని కూడా అమెజాన్ అందించనుంది. హెచ్డీఎఫ్సీ కార్డుహోల్డర్స్కు రూ.4000 క్యాష్బ్యాక్ ఆఫర్తో పాటు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై 1000 రూపాయల వరకు తగ్గింపును కూడా ఇస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఫీచర్లు...
6.3 అంగుళాల క్యూహెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 చిప్సెట్
6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరణ మెమరీ
12ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా