అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

Published Tue, Aug 25 2015 4:38 PM

16 year old girl suspicious death

దోమ (రంగారెడ్డి) : అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతిచెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండలం తిమ్మాయపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన సుగుణమ్మ(16) అనే బాలిక కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె సోమవారం పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది.

మిగతా కుటుంబసభ్యులు పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. కాగా మధ్యాహ్న సమయంలో బాలిక ఇంట్లోకి వచ్చిన పక్కింటివారు.. బాలిక అనుమానాస్పదంగా నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాలిక మృతికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement