రెండు బైకులు ఢీ: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ: ఇద్దరి మృతి

Published Tue, Oct 20 2015 9:53 AM

2 died in road accident at adilabad

కాగజ్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ శివారులోని ఈజ్‌గావ్‌ క్యాంప్ వద్ద మంగళవారం వేకువజామున రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈజ్‌గావ్‌క్యాంప్‌కు చెందిన దేవాషీస్ దాస్, ప్రశాంత్‌రాజ్ ఇద్దరు వేర్వేరు వాహనాల్లో ఎదురెదురుగా ఢీకొన్నారు.

ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement