కరీంనగర్: ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఉదయం నుంచే కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. కలెక్టరేట్లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలువురు ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు.
పంచాయితి కార్యాలయంలో..
మరోవైపు పెంచిన ఇంటి పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఎం, వైఎస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని జమ్మికుంట నగరపంచాయతి కార్యలయాన్ని ముట్టడించాయి. ఈ క్రమంలో లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి
Published Thu, Jan 7 2016 1:03 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement