నేడు 84 మందికి సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
హైదరాబాద్: రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు చనిపోయిన 69 మంది జర్నలిస్టు కుటుంబాలు, పనిచేయలేని స్థితిలో ఉన్న 15 మంది జర్నలిస్టు కుటుం బాలకు శుక్రవారం జనహిత కార్యక్రమంలో సీఎం కె.చంద్రశేఖర్రావు చెక్కులు అందజేయనున్నారు. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ ఏటా రూ.10 కోట్ల చొప్పున రెండేళ్లుగా రూ.20 కోట్లు డిపాజి ట్ చేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన పుట్టినరోజును పురస్కరిం చుకుని ఈ ఆర్థిక సాయం చేయనున్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పెన్షన్, ఆ కుటుంబంలో పదోతరగతి లోపు విద్యార్థులుంటే అదనంగా మరో రూ.1,000 చొప్పున ఇస్తారు. గాయపడిన, అనారోగ్యానికి గురై పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ అధ్యక్షతన పాలకమండలి
జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంబంధించి ప్రత్యేకంగా పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండలికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మల్లేపల్లి లక్ష్మయ్య, సీఆర్ గౌరీశంకర్, యం.నారాయణరెడ్డి, ఎన్.వేణుగోపాల్, కె.అంజయ్య, పౌర సంబంధాల శాఖ నుంచి నాగయ్య కాంబ్లే, ఎల్ఎల్ఆర్ కిశోర్బాబు, ఎస్ఆర్ హాష్మీ ప్రతినిధులుగా, సభ్యకార్యదర్శిగా ప్రెస్ అకాడమీ కార్యదర్శి బి.రాజమౌళి, మేనేజర్గా జి.లక్ష్మణ్కుమార్లను నియమించారు.
జర్నలిస్టుల కుటుంబాలకు సాయం
Published Fri, Feb 17 2017 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement