అల్వాల్, న్యూస్లైన్: మల్కాజిగిరి నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో పలు పార్టీలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని పోటీకి దించాయని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు తెలంగాణ ఆత్మగౌరవానికి మరింత బలాన్నిస్తుందన్నారు. ఇకపై ఆంధ్ర పెత్తనాన్ని సహించేదిలేదన్నారు. అల్వాల్ లోతుకుంటలో శనివారం రాత్రి జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్సత్తా సత్తా లేకుండా పోయి ఏక్సత్తాగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడిని తెలంగాణ వారు వద్దంటున్నా తానిక్కడే ఉంటానని అంటున్నారని, ఆయనిక్కడ ఉండటానికి ఇబ్బంది లేదని, కానీ చక్రం తిప్పుతానంటేనే అభ్యంతరమన్నారు. సెక్రటేరియట్లో 90 శాతం మంది ఆంధ్ర ఉద్యోగుల ఉన్నారని వారిని ఆంధ్రప్రభుత్వంలోనే ఉంచాలని అంటుంటే కాంగ్రెస్ వాళ్లు మాత్రం అభ్యంతరం చెబుతున్నారన్నారు.
కేవీపీ రాంచందర్రావు సహకారంతో టీపీసీసీ పదవి దక్కించుకున్న పొన్నాల లక్ష్యయ్య తెలంగాణ ప్రాంతానికి ఎలా న్యాయం చేయగలుగుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు- వెంకయ్య నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. పొత్తు వద్దని కిషన్రెడ్డి వారించినా పట్టించుకోకుండా బలవంతంగా కుదుర్చుకున్నారన్నారు. టీడీపీ, బీజేపీకి ఓటు వేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దన్నారు.
టీఆర్ఎస్కు 90 స్థానాలు ఖాయం
జీహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్నాయని టీఆర్ఎస్ బలహీనంగా ఉందని పలువురు దుష్ర్పచారం చేస్తున్నారని, అయితే మూడు రోజులుగా టీఆర్ఎస్ బలపడినట్లు సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ అన్నారు. 90 సీట్లు గెలుచుకుని తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుందన్నారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటి వేసి పారదర్శక పాలన అందిస్తామన్నారు. వక్ఫ్, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, అసెంబ్లీ అభ్యర్థులు కనకారెడ్డి, సుధీర్రెడ్డి, గజ్జెల నగేష్, రామ్మోహన్గౌడ్, కొలను హనంతరెడ్డి, గొట్టిముక్కల పద్మారావు, సుభాష్రెడ్డితో పాటు పొలిట్బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ మంత్రి ఎన్ఏ కృష్ణ, నక్క ప్రభాకర్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కల శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
బాబు వాడుకుని వదిలేశాడు: మైనంపల్లి
కేసీఆర్ చొరవతోనే తాను టీడీపీలో చేరానని, అనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ బయటకు వెళ్లినా పార్టీపై అభిమానంతో తాను టీడీపీలో కొనసాగానని, కానీ చంద్రబాబునాయుడు తనను వాడుకుని వదిలేశాడని మల్కాజిగిరి లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు లాగా తనకు వెన్నుపోట్లు పొడవడం రాదన్నారు. పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ, 24 గంటలు పని చేసేలా హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తానన్నారు.
ఆంధ్రా పెత్తనాన్ని సహించం
Published Sun, Apr 20 2014 12:44 AM
Related news
-
నేడు ఉమ్మడి మహబూబ్నగర్లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్నగర్ వరకు భారీ రోడ్షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్కర్నూల్కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ది నయవంచన: రఘునందన్రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
12 లోక్సభ సీట్లు ఇవ్వండి.. ప్రభుత్వం మెడలు వంచుతాం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్నా.. ప్రభుత్వం హామీలను అమలు చేయాలన్నా.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలన్నీ ఎగబెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజలకు ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ వచ్చాక రైతు బంధులో దగా చేస్తోందని.. రైతుబీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. కరెంటు సరిగా రావడం లేదని, నీళ్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. భూమి, ఆకాశం ఒక్కటయ్యేలా ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సుయాత్ర బుధవారం నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలలో నిర్వహించిన రోడ్షోలలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘1956 నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు శత్రువు. అప్పుడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపి 58 ఏళ్లు గోస పెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి, బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన çహామీలన్నీ ఎగబెట్టింది. మళ్లీ లోక్సభ ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చి ఒట్లు వేస్తూ మోసం చేయాలని చూస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం. హామీలు అమలు చేయించగలుగుతాం. ఆ బాధ్యత నాదే. ప్రజలిచ్చే బలంతోనే పోరాటం చేయగలుతాం. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. కరెంటు సరిగ్గా వస్తుంది. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు, కాంగ్రెస్కు మధ్య పంచాయితీ వచ్చింది. ఆ పంచాయితీకి ప్రజల తరఫున పెద్ద మనిషిగా నేనుంటా. పంటలు ఎండటం ఇదే మొదటిసారి బీఆర్ఎస్ తొమ్మిళ్ల పాలనలో 18 పంటలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా సాగర్ ఆయకట్టు నీళ్లు ఇచ్చి బంగారు పంటలు పండించాం. ఇప్పుడు నాగార్జున సాగర్లో నీళ్లున్నా, ఇచ్చే అవకాశమున్నా.. కాంగ్రెస్ దద్దమ్మలకు దమ్ములేక, ప్రాజెక్టును తీసుకుపోయి కృష్ణాబోర్డు చేతిలో పెట్టారు. మొత్తం పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చాక పంటలు ఎండిపోవడం ఇదే మొదటిసారి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంట్.. దిగిపోగానే మాయమైపోయిందా? కేసీఆర్ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును నడిపించలేని అసమర్థులు ఈరోజు ఏలుతున్నారు. ఎందుకు చేతనవడం లేదు? ప్రజలను ఎందుకు బాధ పెడుతున్నారు? మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు? ప్రజలకు నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? రైతులకు అన్యాయం జీవితాన్ని పణంగా పెట్టి, ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక్కో మెట్టు కట్టుకొంటూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నామో ప్రజలకు తెలుసు. అలాంటి రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మేం రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా ఏటా 15, 16 వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు రైతుబంధు ఐదు ఎకరాలకేనంటూ ఎగబెడుతున్నారు. ఎందుకిలా? రైతులకు ఇవ్వడానికి మీకేం బాధ.అదేమైనా మీ అబ్బ సొత్తా..? రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలి. బీఆర్ఎస్ రెండు దఫాలుగా రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేసి, రైతు లను ఆదుకుంది. ఈరోజున్న సీఎం కొన్ని నెలల కింద పరుగెత్తుకొని వచ్చి డిసెంబరు 9 నాడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎందుకు చేయలేదు? ఎందుకింత మోసం చేశారు? నన్ను తిట్టినా ఫర్వాలేదు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే నా ప్రాణం పోయినా వదిలిపెట్టబోను. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా. ధాన్యం ఎందుకు కొనడం లేదు? తన బస్సుయాత్ర వచ్చే దారిలో ఆర్జాలబావి వద్ద రైతులు ఆపి గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తెచ్చి 25 రోజులు అవుతున్నా కొనడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతులు బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారా? ఒకసారి ప్రధాని మోదీ వడ్లు కొనబోమని మొండికేస్తే ఢిల్లీలో ధర్నా చేసినం. మోదీ మెడలు వంచి, మద్దతు ధరతో తెలంగాణ ధాన్యం కొనేలా చేశాం. ఏపీ నీళ్లు తరలించుకుంటే నోరు మెదపరేం.. నీళ్లు, నిధుల కోసం, కరెంటు కోసం, ప్రజల కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. కేసీఆర్ పక్కకు జరిగిన నాలుగైదు నెలలకే నీళ్లు ఎలా మాయమైపోయాయి? నాలుగైదు నెలల కింద ధీమాతో ఉన్న రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఇవాళ మళ్లీ బాధలో పడ్డారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ జిల్లాలోనే ఉన్నా దద్దమ్మలాగా.. నాగార్జునసాగర్ డ్యామ్పై అధికారాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. నీళ్లివ్వడం చేతనైతలేదా? సాగర్ టెయిల్ పాండ్ నుంచి 5 టీఎంసీల నీళ్లను ఏపీ వాళ్లు తీసుకెళ్లారు. అయినా మంత్రి ఉత్తమ్ నోరు మెదపకుండా ఎక్కడ పడుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు కుంగిపోతే 60–70 టీఎంసీల నీళ్లను వదిలేసి రాకుండా చేశారు. తులం బంగారం ఏమైంది? మా హయాంలో రూ.200 పెన్షన్ను రూ.2 వేలు చేసుకున్నాం. దళిత బిడ్డలను లక్షాధికారులను చేసేందుకు దళితబంధు అమలు చేశాం. పేదబిడ్డలకు పెళ్లి చేయాలని రూ.లక్ష ఇచ్చేలా కల్యాణలక్ష్మి పెట్టాం. కాంగ్రెస్ వాళ్లు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వరు కూడా. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామన్న హామీ ఏమైంది? నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఏమైంది?’’అని కేసీఆర్ నిలదీశారు. కేసీఆర్ కాన్వాయ్లో వాహనాలు ఢీ మిర్యాలగూడ టౌన్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా మిర్యాలగూడలో రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొకటిగా వరుసగా 10 వాహనాలు ఢీకొన్నాయి. ఆ వాహనాల ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కేసీఆర్ భయపడతడా? ‘‘నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో 225 మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారు. గురుకులాల్లో తిండి సరిగా పెట్టడం లేదు. 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై.. నలుగురు ఐదుగురు చనిపోయారు. దానిపై ప్రశ్నిస్తే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జైల్లో వేస్తామంటున్నారు. కేసీఆర్ భయపడతాడా? అలా భయపడితే తెలంగాణ వచ్చేదా? పేగులు తీసి మెడలేసుకుంటం, గుడ్లు తీసి గోలీలాడుతం, పండబెట్టి తొక్కుతం అంటూ సీఎం మాట్లాడుతున్నారు. కేసీఆర్ చెడ్డీ ఊడబీకుతామంటున్నారు. నా చెడ్డీతో ఏం చేసుకుంటారు? ఒక మాజీ సీఎంను టార్గెట్ చేసే విధానం ఇదేనా? 15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడుతారా? ప్రజలు ఆలోచించాలి’’ తెలంగాణ తల్లికి పూలమాల వేసి.. లోక్సభ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ప్రారంభించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం మధ్యాహ్నం మొదలైంది. ఒంటి గంట సమయంలో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం ప్రత్యేక బస్సులో, కాన్వాయ్తో బయలుదేరారు. ఇన్నాళ్లూ తెలంగాణ భవన్ దక్షిణ గేటు నుంచి రాకపోకలు సాగించిన కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈశాన్య ద్వారం నుంచి బస్సు యాత్రకు బయలుదేరారు.మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో వేచి ఉన్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. నల్లగొండ పట్టణ శివారులోని అన్నెపర్తి వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. తర్వాత ఆర్జాలబావి వద్ద కూడా రైతులతో మాట్లాడి.. వారి బాధలను తెలుసుకున్నారు. మాడ్గులపల్లిలోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. తర్వాత మిర్యాలగూ డ, సూర్యాపేట రోడ్ షోలలో ప్రసంగించారు. రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో బస చేశారు. నేడు భువనగిరిలో రోడ్ షో బస్సుయాత్రలో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం వరకు కేసీఆర్ సూర్యాపేటలోనే ఉండనున్నారు. నల్లగొండ, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల నేతలతో ప్రచార సరళిని సమీక్షించనున్నారు. సాయంత్రం భువనగిరిలో నిర్వహించే రోడ్ షోలో ప్రసంగిస్తారు. మొత్తంగా మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు 12 లోక్సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. రైతులతో కేసీఆర్ మాటా మంతీ నల్లగొండ రూరల్: కేసీఆర్ బస్సుయాత్రలో భాగంగా నల్లగొండ మండలం అన్నెపర్తి, ఆర్జాలబావి గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. అన్నెపర్తి వద్ద.. రైతు వెంకన్న: రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది సార్.. కేసీఆర్: ఎందుకు.. ఏమైంది? రైతు: మీరు దిగిపోయారు. వానలు లేవు. వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ చెయ్యలేదు. కేసీఆర్: ఇటు రాండ్రి.. బాగున్నారా.. (మాజీ సర్పంచ్ అరవింద్రెడ్డి, మాజీ ఎంçపీటీసీ ఆండాలు, గట్టయ్యలను పిలిచారు) మాజీ ప్రజాప్రతినిధులు: బాగున్నాం సార్. ఐకేపీ సెంటర్లో బాధలు చూడాలి సార్. కేసీఆర్: ఎలాంటి సమస్య ఉన్నా పోరాడుదాం. ఏదైనా ఉంటే భూపాల్రెడ్డి (నల్లగొండ మాజీ ఎమ్మెల్యే), కృష్ణారెడ్డి (బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి)కి చెప్పండి. దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఆర్జాలబావి వద్ద.. రైతు గుండగోని పాపయ్య: సార్, మీ పాలనే బాగుండే. 20 రోజులైంది ధాన్యం తూకం కాలేదు. బోనస్ లేదు. రుణమాఫీలేదు. చెరువుల్లో నీళ్లు లేవు.. సక్రమంగా కరెంటు లేదు. రైతు బంధు రాలే. మళ్లీ మీరే రావాలి సార్. కేసీఆర్: ధాన్యం కొంటలేరా? రైతు: కొంటలేరు సార్. ఎండకు చస్తున్నాం. కేసీఆర్: అందరూ రెడీగా ఉండండి.. పోరాటం చేద్దాం.. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చరో చూద్దాం. -
రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొంత మంది నాయకులు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ దిక్కులేదని విమర్శించారు. ఘట్కేసర్లో బుధవారం మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. రేవంత్ బీజేపీలో చేరడం పక్కా ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు రేవంత్ మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని. మీ పక్కనే ఉన్నాయన్నారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్నింటిని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం ఖచ్చితంగా బీజేపీలో చేరుతాడని జోస్యం చెప్పారు. భద్రాచలానికి బీజేపీ ఒక్క రూపాయైనా ఇచ్చిందా? పదేళ్లు దేశాన్ని నడిపిన ప్రధాని మోదీ తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు. సీఎం గుంపు మెస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రి అని ఎద్దేవా చేశారు. ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రాష్ట్రంపై ప్రేమ ఉంటే.. భద్రాచలం ఆలయానికి ఒక్కరూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడేనని అన్నారు. చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్రావు రిమాండ్ పొడిగింపు రాముడితో పంచాయితీ లేదు.. బీజేపీతోనే.. ‘శ్రీరాముడు అందరివాడు.. ఆ రాముడితో మనకు పంచాయితీ లేదు.. పంచాయితీ అంతా బీజేపీతోనే. ఈ పదేళ్లలో ఏం చేశారని బీజేపీ వాళ్లను ప్రశ్నిస్తే జైశ్రీరాం అంటారు. రాముడు బీజేపీ పార్టీ మనిషి కాదు.. ఆయన అందరి మనిషి. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని తరిమేయాలన్నారు కేటీఆర్. యాదాద్రిని రాజకీయంగా వాడుకోలేదు. దేవుడు దేవుడే.. ధర్మం ధర్మమే.. రాజకీయం రాజకీయమే. ఎవరు మన కోసం పని చేస్తున్నారో.. ఎవరు దేవుళ్లను అడ్డం పెట్టుకుని బతుకుతున్నారో ప్రజలకు వివరించాలి. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, మతోన్మాదానికి కారణమైన బీజేపీని పాతరేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పవర్ విషయంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న ఉత్తమ్.. సీఆర్కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్లో ఎవరూ ఉండరంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనమరుగవుతుందన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేవనీ అసత్యాలేనని ఉత్తమ్ అన్నారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది.. దానికి కరెంటు పోయిందని కేసీఆర్ అబద్దం చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదు.. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదు. ఇరిగేషన్పై మాట్లాడే అర్హత కేసీఆర్కి లేదు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారు. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారు’’ అంటూ ఉత్తమ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు.
Related News by category
-
డింపుల్ యాదవ్ సింపుల్ పొలిటీషియన్
డింపుల్ యాదవ్. సైనిక కుటుంబానికి చెందిన సాదాసీదా అమ్మాయి. అఖిలేశ్ యాదవ్ను పెళ్లాడి అనూహ్యంగా బడా రాజకీయ కుటుంబంలో అడుగు పెట్టారు. తొలుత తనను అంతగా ఇష్టపడని ములాయం సింగ్ యాదవ్కు ప్రియమైన కోడలిగా మారారు. తండ్రీ కొడుకుల రాజకీయ విభేదాలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అంతే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రమూ చేసినా స్వయంకృషితో ఎంపీగానూ రాణించారు. అలా ఇంటా బయటా ఫుల్ మార్కులు కొట్టేశారు.డింపుల్కు తొలుత రాజకీయాలు, కులాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె పుట్టింది పూర్తి భిన్నమైన కుటుంబం కావడమే అందుకు కారణం. అలాంటిది పెళ్లి తర్వాత వాటిపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. కుల సమీకరణాలకు పుట్టిల్లయిన యూపీ వంటి రాష్ట్రంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. స్వతహాగా మితభాషి అయినా వేదిక ఎక్కితే మాత్రం డింపుల్ అద్భుతమైన వక్త. యూపీలోని మెయిన్పురి లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే సమాజ్వాదీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి... రాజకీయాల్లోకి రావాలని డింపుల్ ఎప్పుడూ అనుకోలేదు. భర్త అఖిలేశ్ యాదవ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్, కన్నౌజ్ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. కన్నౌజ్ను అట్టిపెట్టుకోవడంతో ఫిరోజాబాద్కు ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ డింపుల్ బరిలో దిగాల్సి వచి్చంది. కానీ బాలీవుడ్ నటుడు రాజ్బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం కావడంతో కన్నౌజ్ లోక్సభ స్థానమూ ఖాళీ అయింది. అక్కడి నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్నౌజ్కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా, యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళా ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు. 2019లో బీజేపీ నేత సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. 2022లో మామ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి లోక్సభ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో డింపుల్ భారీ విజయం సాధించారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని డింపుల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా ప్రచారం చేశారు. భర్తకు మద్దతుగా 20 ర్యాలీల్లో ప్రసంగించారు. అంతకుముందు కుటుంబ కలహాల వేళ తండ్రీ కొడుకుల మధ్య సఖ్యత నెలకొల్పారు.ప్రేమ, పెళ్లి, పిల్లలు.. డింపుల్ మహారాష్ట్రలోని పుణెలో 1978 జనవరి 15న జని్మంచారు. తండ్రి ఆర్మీ కల్నల్ రామ్చంద్ర సింగ్ రావత్. వారిది ఉత్తరాఖండ్. తండ్రి ఉద్యోగరీత్యా పుణె, భటిండా, అండమాన్, నికోబార్ దీవుల్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో చదివారు డింపుల్. లక్నో యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. అఖిలేశ్ను తొలిసారి చూసినప్పుడు డింపుల్ ప్లస్ టూ చదువుతున్నారు. ఆమెకు 17 ఏళ్లు, అఖిలేశ్కు అప్పుడు 21 ఏళ్లు. ఇంజనీరింగ్ చేస్తున్నారు. కామన్ ఫ్రెండ్ పార్టీలో పరిచయమైంది. తొలి భేటీలోనే మంచి స్నేహితులయ్యారు. పై చదువులకు అఖిలేశ్ ఆ్రస్టేలియా వెళ్లారు. అప్పుడు ఇద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అలా ప్రేమ చిగురించింది. తిరిగొచ్చాక అఖిలేశ్పై పెళ్లి ఒత్తిడి పెరగడంతో డింపుల్ గురించి అమ్మమ్మకు చెప్పారు. కుటుంబ నేపథ్యాలు వేర్వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. అఖిలేశ్ పట్టుదల చూసి తండ్రి ములాయం సింగ్ చివరికి పెళ్లికి అంగీకరించారు. అలా 1999న వారు ఒకటయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అదితి. అర్జున్, టీనా కవలలు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడానికి ఇష్టపడతారు డింపుల్. ‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. రాజకీయాలతోపాటు పిల్లలకు సమయమివ్వడానికి ఇష్టపడతా’’ అంటారు. -
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
కాసేపట్లో ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్
Live Updates.. తాడిపత్రి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్నేటి నుంచి మలివిడత ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్న సీఎం జగన్నేడు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం జగన్⇒పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.⇒రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు.⇒అనంతరం.. మ.12.30కు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగసభలోనూ.. అలాగే, మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు.⇒సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్.. ⇒ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది. -
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని మండిపడ్డారు. శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీర్పూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వెనక కాంగ్రెస్తో పాటు విదేశీ హస్తం ఉంది. మీ(ప్రజల) పిల్లల ఆస్తులను ముంస్లికు ఇవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ఆణ్వాయుధాలను నాశనం చేయనున్నారు. కులం, మతం పేరుతో దేశం మొత్తాన్ని విభజించనున్నారు. టుక్డే-టుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ చుట్టూ చేరి.. ఆ పార్టీ సిద్ధాంతాలను హైజాక్ చేస్తోంది. మీ( ప్రజలు) సంపద మీతోనా ఉండలా? లేదా ముస్లింలకు వెళ్లాలా? మీరే నిర్ణయం తీసుకోండి. మేము ముస్లింకు అన్ని హక్కులు సమానంగా కల్పించాం. కానీ, మత ప్రాతిపదికన మేము హక్కులు కల్పించలేదు. ఎందుకుంటే అవి ప్రజలందరి హక్కు’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.#WATCH | Hamirpur, Himachal Pradesh: Union Minister Anurag Thakur says, "In the Congress manifesto, along with the hand of the Congress, hands of foreign forces are also visible who want to give your children's property to Muslims, finish the nations nuclear weapons, divide the… pic.twitter.com/3dxJE6avvz— ANI (@ANI) April 27, 2024 అనురాగ్ ఠాకుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన ఠాకుర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement