కమ్మర్పల్లి: తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయిస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని, అది ఎవరి వల్ల సాధ్యం కాదని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి అన్నారు. తమ పార్టీ టాటా కంపెనీ లాంటిదని దాన్ని ఎవరు ఏమి చేయలేరన్నారు. సోమవారం మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తల కు గుర్తింపు కార్డులను నర్సారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తోందన్నారు.
రైతాంగానికి ఏడు గంట ల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని, ప్రతి రైతుకు రుణమాఫీ, ప్రతి నిరుపేద కుటుంబానికి పింఛన్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం వీటిని విస్మరించారన్నారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోతే మెడలు వంచి పని చేయిస్తామన్నారు. రుణమాఫీ పథకం కింద బ్యాంకుల్లో 25 శాతం మాత్రమే రుణం ఇస్తున్నార ని, కానీ నూరు శాతానికి రైతులతో సంతకం తీసుకుంటున్నారని ఆరోపించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం ఒక్కటై రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రైతులు ఎంత మొత్తం తీసుకుంటే అంతే మొత్తానికి సంతకం తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం లో చెరువులు కుంటలను అభివృద్ధి చేస్తామని సీఎం ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఇదివరకు పరి పాలించిన ప్రభుత్వాలు చెరువులు, కుంటలను కా పాడకపోతే ఇపుడు అవి ఉండేవా అని ప్రశ్నించా రు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి జనవరి ఒకటి నుంచి బీమా వర్తిస్తుందని తెలిపారు. సభ్యత్వం తీసుకోవడానికి మంగళవారం ఆఖరి రోజన్నారు.
టీడీపీని ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు
Published Tue, Dec 23 2014 2:01 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement