నేడు కేబినెట్ భేటీ | Sakshi
Sakshi News home page

నేడు కేబినెట్ భేటీ

Published Tue, Apr 7 2015 1:57 AM

నేడు కేబినెట్ భేటీ - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తయారు చేసిన ప్రణాళికలు, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ రిజిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటు సహా పలు అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి.

పర్యాటకాభివృద్ధిలో భాగంగా కరీంనగర్ సమీపంలోని ఎల్‌ఎండీ పార్కు(ఉజ్వల)ను బృందావన్ గార్డెన్‌గా తీర్చిదిద్దడం, ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ వద్ద  కొమురం భీం సాంస్కృతిక కేంద్రం, నల్లగొండ జిల్లా భువన గిరి వద్ద ‘ అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ’ ఏర్పాటు, టూరిజం రిసార్ట్‌ల ఏర్పాటు వంటివీ చర్చకొస్తాయని తెలిసింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నివేదికపై, పాఠ్యపుస్తకాల మార్పు, జీహెచ్‌ఎంసీ అభివృద్ధి, సాగర్ ప్రక్షాళన అంశాలపైనా చర్చిస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులతో పాటు ప్రస్తుతం పనులు జరుగుతున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు భూ సేకరణ వంటి విషయాలపైనా చ ర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
Advertisement