నేడు వెలువడనున్న ఉత్తర్వులు
పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్గా ఉన్న చిరంజీవులు
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జీ వీసీ గా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్ టి.చిరంజీవులును నియమిం చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.వీరారెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి కాకతీయ యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఇన్చార్జీ వీసీగా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయ న పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో కేయూ ఇన్చార్జి వీసీగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్గా ఉన్న చిరంజీవులు కుబా ధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలిసింది. సంబంధిత ఫైల్పై రెండు రోజు లక్రితమే సీఎం సంతకం కూడా అయినట్లు సమాచారం.
విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సంతకమైన తర్వాత ఆ ఉత్తర్వులు శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం వెలువడే అవకాశాలున్నాయి. కేయూకు రెగ్యులర్ వీసీగా బి.వెంకటరత్నం పదవీకాలం 2014, మే 17న ముగి సింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్చాన్సలర్ లేరు. వెంకటరత్నం పదవీ విరమణ తర్వాత... ముగ్గురు ఇన్చార్జి వీసీలు మారారు. 2014, మే 18 నుంచి జూలై 9 వరకు ఇన్చార్జి వీసీగా ఐఎఫ్ఎస్ అధికారి ఆర్ఎం డోబ్రియాల్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్రాజ్ పనిచేశారు. సెప్టెంబరు 24 వరకు ఇన్చార్జి వీసీ గాపనిచేసిన ఆయన ఒక్కసారి కూడా యూనివర్సిటీ ముఖం చూడలేదు. ఈ సమయంలో యూనివర్సిటీలో పాలన మరిం త గాడితప్పింది. తర్వాత సెప్టెంబర్ 25న బాధ్యతలు స్వీకరించిన వీరారెడ్డి రెండుసార్లే వర్సిటీకి వచ్చారు.
ఆయన పదవీకాలంముగియటంతో ఆయన స్థానంలో చిరంజీవులును నియమించనట్లు తెలుస్తోంది. చిరంజీవులు వరంగల్ జిల్లకు చిరపరిచతులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన చిరంజీవులు గతం లో జిల్లాలో ఆర్డీఓగా, డీఆర్వోగా, డీఆర్డీఏ జిల్లా పీడీగా పని చేశారు. సుమారు ఎనిమి దేళ్లు ఆయా బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక ఇటీవల ఆయన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్గా, కమిషనర్గా నియమితులయ్యూరు. కాగా శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా మాత్రం వీరారెడ్డినే కొనసాగించనున్నారని తెలిసింది.
కేయూ ఇన్చార్జి వీసీగా చిరంజీవులు!
Published Sat, Apr 18 2015 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement