కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న అన్ని బొగ్గుగనుల మీదుగా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి, చెల్పూరు(ఘన్పూర్), గోవిందరావుపేట (ములుగు), మణుగూరు వరకు రైల్వేలైన్ నిర్మాణం కోసం 1982లోనే రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. అధికారులు దీనికి ‘కోల్ కారిడార్’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
2010లో అప్పటి పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ప్రతిపాదనను మరోసారి అప్పటి రైల్వేమంత్రి దృష్టికి తీసుకుపోగా.. సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ప్రస్తుతం ఈ లైన్ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. దీంతో రూ.10వేల కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. కోల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే అటవీ ప్రాంతాలైన మంథని, భూపాలపల్లికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.
ఆ రెండు లైన్లకు ఆమోదం లభించేనా?
జిల్లావాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడే విధంగా కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్ -హసన్పర్తి వరకు కొత్త లై న్ వేయాలని అప్పటి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పలుమార్లు ప్రతిపాదనలు సమర్పించారు. కానీ అవి ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు.
కనీస సౌకర్యాలు కలిగేనా?
జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. సౌకర్యాలపై అధికారులు సైతం శ్రద్ధ చూపడంలేదు. రామగుండం రైల్వేస్టేషన్లో రెండో వైపు కూడా టికె ట్ కౌంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి వద్ద, కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం అత్యవసరం. గత డిసెంబర్లో రామగుండం రైల్వే ప్రధాన గేటు వద్ద కుప్పకూలిన బ్రిడ్జి నిర్మా ణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
జిల్లాలో పలు మార్గాల నిర్మాణం సగం వర కు పూర్తికావడంతో ఆయా ప్రాంతాల నుం చి సమీప ప్రాంతాలకు పుష్పుల్ రైలు నడపాలనే డిమాండ్ వస్తోంది. ప్రజా విజ్ఞప్తుల పై గత ఎంపీలు సైతం ఏకీభవించారు. కరీంనగర్ నుంచి మోర్తాడ్ వరకు రైలు మార్గం పూర్తయినందున కరీంనగర్, మెట్పల్లి మధ్య పుష్పుల్ రైలు నడపాలని కోరుతున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వర కు మరో రైలు నడపాల్సిన అవసరముంది.
సూపర్ఫాస్ట్ రైళ్లు ఆగేనా?
చెన్నయ్ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్థ్ ్రసూపర్ఫాస్ట్ రైలు నెల్లూరు (ఆంధ్రప్రదేశ్), చంద్రాపూర్ (మహారాష్ట్ర) మినహా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా ఆగదు. కనీసం రామగుండం, మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్ఫాస్ట్ రైలును పెద్దపల్లిలో నిలుపాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. రామగుండంలో రైల్వేస్టేషన్లో నవ్జీవన్, జైపూర్, స్వర్ణజయంతి రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ప్రయాణికులు ఏళ్ల నుంచి కోరుతున్నారు.
కోల్ కారిడార్కు మోక్షం కలిగేనా?
Published Mon, Jul 7 2014 1:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement