తలలు పగలగొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు | Sakshi
Sakshi News home page

తలలు పగలగొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు

Published Tue, Aug 8 2017 5:55 PM

తలలు పగలగొట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు - Sakshi

భువనగిరి: జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు తలలు పగిలేలా కొట్టుకున్నారు. దేవరకొండకు చెందిన కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ ప్రెసిడెంట్‌ జగన్నాథ్‌నాయక్‌, మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త నారాయణ సమావేశం జరుగుతుండగానే ఘర్షణ పడ్డారు. ఇద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. తలలు పగిలి రక్తమోడుతుండగా అక్కడి వారు వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు ప్రశాంత్‌, సీనియర్‌ నేత మల్లు రవి సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.

Advertisement
Advertisement