‘ఆ రచయితను మరణించనివ్వం’ | Sakshi
Sakshi News home page

‘ఆ రచయితను మరణించనివ్వం’

Published Wed, Jan 21 2015 12:41 AM

CPM central committee comes out in support of author

సాక్షి, హైదరాబాద్:  ‘రచయితగా మరణించాను’ అని ప్రకటించిన ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌కు సీపీఎం కేంద్ర కమిటీ అండగా నిలిచింది. ఆయన్ని రచయితగా బతికించుకుంటామని ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, రచయిత వాసుకీ  ‘సాక్షి’ ప్రతినిధితో  మాట్లాడారు. ఆ రచయితను మరణించనివ్వం అని చెప్పారు.  మురుగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూస్తామని, ఆయన కలం నుంచి మరిన్ని చైతన్యవంతమైన రచనలు వెలువడేలా సీపీఎం పోరాడుతుందని వాసుకీ తెలిపారు.

Advertisement
Advertisement