కోడేరు(మహబూబ్నగర్): పాలమూరును కరువు జిల్లాగా ప్రకటించి రైతులను అనేక రకాలుగా ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ఎన్.శ్రీనివాసులు, కోడేరు ఉప సర్పంచ్ కాకం లక్ష్మయ్య, చంద్రమౌలి, రాములు శనివారం డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా ఎన్నో సంవత్సరాలుగా కరువుతో అల్లాడుతూ వలసలకు పేరుపొందిందని, అలాంటి జిల్లాను ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
అలాగే ప్రభుత్వం భూ సేకరణ ఆర్డినెన్స్ను రద్దు చేయాలని, పంటల రుణాలను ఒకేసారి మాఫీ చేసి కొత్త రుణాలను ఇవ్వడమే కాక ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు పనుల కోసం పలు ఇబ్బందులకు గురవుతున్నారని, కనుక గ్రామాల్లో వెంటనే ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.