నిర్మాణాత్మక సలహాలివ్వాలి
గజ్వేల్ : అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి పార్టీలకతీతంగా సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రతిపక్షాలను కోరారు. గురువారం గజ్వేల్ నియోజక వర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్ మండలాల్లో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్లోని పెద్దచెరువులో రూ.31.34 లక్షల వ్యయంతో చేపట్టనున్న మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్వామిగౌడ్ మాట్లాడారు.
పేద, బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని కొనియాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. స్వయం సహాయక బృందాలకు రుణాలను రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబనవైపు పయనించాలని పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన గజ్వేల్ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.
సీఎం ఆశయాలకనుగుణంగా ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు పనిచేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య ఉన్నా హన్మంతరావుకు చెబితే క్షణాల్లో ఆయన సీఎం దృష్టికి వెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపుతారన్నారు. బంగ్లా వెంకటాపూర్ సర్పంచ్ విజ్ఞప్తి మేరకు గ్రామంలో మురుగునీటి కాల్వల నిర్మాణం కోసం రూ.25 లక్షలు మంజూరు చేయాలని ‘గడా’ ఓఎస్డీకి స్వామిగౌడ్ సూచించారు.
కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ సభ్యులు జేజాల వెంకటేశ్గౌడ్, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు, బంగ్లావెంకటాపూర్ సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ సభ్యులు అంజిరెడ్డి, నాయకులు బురాన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే సభలో పలువురు మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని మండలి చైర్మన్ను వేడుకున్నారు. అంతకుముందు మండలి చైర్మన్కు బోనాలతో స్వాగతం పలికారు.
అభివృద్ధే లక్ష్యంగా..
Published Fri, May 8 2015 12:28 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ
పథకాల నగదును చంద్రబాబే ఆపించారు
వ్యాపారులపై పగబట్టిన దామచర్ల
జగనన్న పంపిన సేవకుడిని
మౌలిక వసతులకు పెద్దపీట
అధునాతన వైద్యం
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సీఎం జగన్తోనే రాష్ట్రాభివృద్ధి
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement